వృద్ధ ఇంజనీర్ చేసిన సైకిళ్లపై ఆనంద్ మహీంద్ర ప్రశంసలు.. బంపర్ ఆఫర్
Anand Mahindra: వడోదరలోని తమ వర్క్షాప్ని సుధీర్ ప్రయోగాల కోసం వాడుకోవాలనుకుంటే తనకు తెలియజేయాలని..
గుజరాత్కు చెందిన ఓ వృద్ధుడు చేసిన ప్రత్యేక సైకిళ్లు మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాను ఆకర్షించాయి. వృద్ధ ఇంజనీర్ సుధీర్ భావే ప్రత్యేకమైన సైకిల్ డిజైన్లు అభివృద్ధి చేస్తుంటారు. ఆయన గురించి తెలుసుకున్న ఆనంద్ మహీంద్ర ప్రశంసించకుండా ఉండలేకపోయారు. అలాగే, ఓ బంపర్ ఆఫర్ కూడా ఇచ్చారు.
ఇవాళ తన ఇన్బాక్స్లో సుధీర్ భావే స్టోరీ కనపడిందని, ఆయన సృజనాత్మకతకు సలాం అని చెప్పారు. దేశంలో ఆవిష్కరణలు, స్టార్టప్లకు మూలం యువత మాత్రమే కాదన్న విషయాన్ని సుధీర్ నిరూపించారని తెలిపారు. వడోదరలోని తమ వర్క్షాప్ని సుధీర్ ప్రయోగాల కోసం వాడుకోవాలనుకుంటే తనకు తెలియజేయాలని, ఆ అవకాశం కల్పిస్తానని చెప్పారు.
సుధీర్ రిటైర్డ్ కాలేదని, ఆయన తన జీవితంలోనే అత్యంత ప్రతిభను చాటే కాలాన్ని గడుపుతున్నారని తెలిపారు. కాగా, ఆనంద్ మహీంద్ర పోస్ట్ చేసిన వీడియోలో సుధీర్ భావే వినూత్నమైన డిజైన్లతో సైకిల్లను రూపొందించినట్లు కనపడుతోంది. సోషల్ మీడియాలో ఆనంద్ మహీంద్రా చురుకుగా ఉంటారు. ఆయనకు ట్విట్టర్లో 11.2 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
This wonderful story showed up in my inbox today.
I bow low to Sudhir Bhave’s irrepressible creativity and energy.
Sudhir has demonstrated that inventiveness & a startup DNA in India is not only the prerogative of the young!
And if you want to use the workshop of our… pic.twitter.com/0Cp821pIyA
— anand mahindra (@anandmahindra) July 18, 2024
Also Read: మైక్రోసాప్ట్ సేవలకు అంతరాయం.. ప్రపంచ వ్యాప్తంగా బ్యాంకులు, విమానయాన, టెలీకాం రంగాలపై తీవ్ర ప్రభావం