Bihar: బిహార్ రాష్ట్రంలో ఇసుక మాఫియా రెచ్చిపోయింది. మంగళవారం ఉదయం రాష్ట్రంలోని గర్హి పోలీస్ స్టేషన్ పరిధిలోని రోపావెల్కు అక్రమ మైనింగ్, ఇసుక రవాణాపై సమాచారంతో చర్య తీసుకోవడానికి వెళ్లిన పోలీసు వాహనాన్ని ఇసుక ట్రాక్టర్ తో ఢీకొట్టి నుజ్జునుజ్జు చేశారు. ఈ ఘటనలో ఎస్ఐ ప్రభాత్రంజన్తో పాటు ఓ జవాను మృతి చెందారు. అయితే ఈ ఘటనపై ఆ రాష్ట్రానికి చెందిన విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ అత్యంత హేయంగా స్పందించారు. ‘‘ఇదేం కొత్త ఘటన.. ఇలాంటి ఘటన తొలిసారిగా జరిగిందా.. గతంలో ఎన్నడూ జరగలేదా.. ఉత్తరప్రదేశ్లో జరగదా.. మధ్యప్రదేశ్లో జరగలేదా?’’ అని మీడియా అడిగిన ప్రశ్నలకు విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ సమాధానం ఇచ్చారు.
మంత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ ‘‘నేరస్థులు ఎవరైనా ఉంటే ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉంటాయి. ఇది ఎప్పటికప్పుడు జరుగుతుంది, దోషులకు తగిన సమాధానం ఇవ్వడం కూడా మామూలే. నేరస్థులు ఎక్కువ సమయం తప్పించుకుని ఉండలేరు. 24 నుంచి 48 గంటల్లో జైలులో ఉంటారు. ఇలాంటి నేరాలు కొత్తేమీ కాదు’’ అని చంద్రశేఖర్ మరోసారి పునరుద్ఘాటించారు.
ఇసుకను అక్రమంగా తవ్వి ట్రాక్టర్లో తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందిందని తెలియజేద్దాం. అనంతరం ఎస్ఐ ప్రభాత్ రంజన్ నేతృత్వంలోని పోలీసు బృందం చర్యలకు బయలుదేరింది. రోపావెల్ రూరల్ రోడ్డులో ఇసుక లోడుతో వెళ్తోన్న ట్రాక్టర్ను పోలీసులు ఆపమని అడిగారు. అయితే ఆ ట్రాక్టర్ డ్రైవర్.. ఏకంగా పోలీసు వాహనాన్ని తొక్కించి అక్కడి నుంచి పారిపోయాడు.
ఈ ఘటనలో ఎస్ఐ ప్రభాత్రంజన్ సహా ఒక జవాన్ గాయపడ్డారు. గాయపడిన ఇద్దరినీ చికిత్స నిమిత్తం వెంటనే సదర్ ఆస్పత్రికి తరలించారు. మార్గమధ్యంలో ఎస్ఐ ప్రభాత్ రంజన్ మృతి చెందారు. కాగా కొంత సేపటికి జవాన్ ఊపిరి కూడా ఆగిపోయింది. బైధాని ఎస్ఐ ప్రభాత్ రంజన్ 2018 బ్యాచ్ పోలీసు అధికారి.