2022కి కొత్త పార్లమెంట్ భవనం
2022 పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొత్తగా నిర్మించబోయే పార్లమెంట్ భవనంలో నిర్వహించాలని ఫ్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్రపతి భవన్, ఇండియా గేట్కు మధ్య ఉత్తర, దక్షిణ బ్లాకుల వద్ద 3 కిలోమీటర్ల విశాలమైన సెంట్రల్ విస్తాను ఈ ప్రాజెక్ట్లో భాగంగా నిర్మించనున్నారు. దీని కోసం ప్రభుత్వం దేశ విదేశాల నుంచి డిజైన్, ఆర్కిటెక్ట్ సంస్థలను పిలిచింది.

2022 పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొత్తగా నిర్మించబోయే పార్లమెంట్ భవనంలో నిర్వహించాలని ఫ్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్రపతి భవన్, ఇండియా గేట్కు మధ్య ఉత్తర, దక్షిణ బ్లాకుల వద్ద 3 కిలోమీటర్ల విశాలమైన సెంట్రల్ విస్తాను ఈ ప్రాజెక్ట్లో భాగంగా నిర్మించనున్నారు. దీని కోసం ప్రభుత్వం దేశ విదేశాల నుంచి డిజైన్, ఆర్కిటెక్ట్ సంస్థలను పిలిచింది.
2022 పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొత్తగా నిర్మించబోయే పార్లమెంట్ భవనంలో నిర్వహించాలని ఫ్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్రపతి భవన్, ఇండియా గేట్కు మధ్య ఉత్తర, దక్షిణ బ్లాకుల వద్ద 3 కిలోమీటర్ల విశాలమైన సెంట్రల్ విస్తాను ఈ ప్రాజెక్ట్లో భాగంగా నిర్మించనున్నారు. దీని కోసం ప్రభుత్వం దేశ విదేశాల నుంచి డిజైన్, ఆర్కిటెక్ట్ సంస్థలను పిలిచింది.
కొత్తగా నిర్మించనున్న ఈ భవనాలు కనీసం 150 నుంచి 200 ఏళ్లపాటు సేవలు అందించనున్నాయి. ఫ్లోటింగ్ ఆఫ్ రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ (ఆర్ఎఫ్పీ)లోని నిర్దేశిత నిబంధనల ప్రకారం నిర్మాణాలు చేపట్టాల్సి ఉంటుందని ప్రభుత్వం పేర్కొంది. ఇప్పుడున్న భవన సముదాయం 1927లో నిర్మితమైందని, ప్రస్తుతం కావాల్సిన అవసరాలను అది అందుకోలేకపోతోందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఒక వేళ నిర్దేశిత సమయంలో కొత్త పార్లమెంట్ భవనం పూర్తిచేయలేక పోతే ప్రస్తుతం ఉన్నభవనాలకే హంగులద్దాలని కూడా యోచిస్తున్నారు.
మరో వైపు కొత్త భవనం నిర్మించాలా లేక పాతదాన్నే పునర్నిర్మించాలా ? అనే అంశంపై ప్రభుత్వం ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. వివిధ మంత్రిత్వ శాఖల కింద ఉన్న ఆఫీసు కార్యాలయాలను నిర్వహించేందుకు ఏటా రూ. 1,000 కోట్లు ఖర్చువుతోంది. కొత్తవాటిని నిర్మించడం ద్వారా ఈ వ్యయాన్ని ఆదా చేయ వచ్చని ప్రభుత్వం భావిస్తోంది.