యూనివర్శిటీలో ఆమె ఒక రోల్ మోడల్.. డబుల్ ఎమ్‌ఏ చదివి యాచకురాలిగా.. కాలం మార్చిన కథ

  • Published By: vamsi ,Published On : October 19, 2020 / 05:36 PM IST
యూనివర్శిటీలో ఆమె ఒక రోల్ మోడల్.. డబుల్ ఎమ్‌ఏ చదివి యాచకురాలిగా.. కాలం మార్చిన కథ

Updated On : October 19, 2020 / 5:45 PM IST

ఉత్తరాఖండ్‌లోని కుమావున్ విశ్వవిద్యాలయం ప్రాంగణం ఒకప్పుడు హన్సీ ప్రహరి అనే నినాదాలతో ప్రతిధ్వనించేది. ఉపరాష్ట్రపతిని సైతం మెప్పించిన వాగ్ధాటి ఆమె. రాజకీయాలు, ఇంగ్లీష్ సబ్జెక్టుల్లో డబుల్ ఎంఏ. అనర్గలంగా ఇంగ్లీషులో ఎవరితో అయినా మాట్లాడగల ప్రతిభావంతురాలు ఆమె. క్యాంపస్‌లో ఆమె లేకుండా మీటింగ్ ఉండేది కాదు. కుమావున్ విశ్వవిద్యాలయంలో రెండు సార్లు అంగ్లంలో పట్టభద్రురాలైన హన్సీ ప్రహారి అక్కడే విద్యార్థి నాయకురాలిగా ఎదిగారు.



జీవితంలో పెద్దగా ఏదైనా సాధించగలదని అందరూ భావించారు. కానీ కాల చక్రం ఎలా తిరుగుతుందో ఎవరికి తెలుసు? కాలం మార్చిన కథలో ఒకప్పుడు విశ్వవిద్యాలయంలో రోల్ మోడల్‌గా ఉన్న అమ్మాయి, ఈ రోజు యాచకురాలిగా బతుకుతుంది. హరిద్వార్ రోడ్లు, రైల్వే స్టేషన్లు, బస్సు స్థావరాలు మరియు గంగా ఘాట్లలో ఆమె వేడుకోని బతుకుతుంది. ఆమె గతం ఎంత బంగారంగా ఉండేదో.. ఇప్పుడు మాత్రం ఆమె పరిస్థితి ధీనంగా మారిపోయింది.. ఎవరు నమ్మలేనంతగా..



ఉత్తరాఖండ్‌లోని అల్మోరా జిల్లాలోని సోమేశ్వర్ ప్రాంతంలో రాంఖిలా గ్రామం హవల్‌బ్యాగ్ బ్లాక్ పరిధిలో పెరిగిన హన్సీ ప్రహరి ఐదుగురు తోబుట్టువులలో పెద్ద కుమార్తె. ఆమె చదువు గురించి మొత్తం గ్రామంలో చర్చించేవారు. తండ్రి చిన్న ఉద్యోగం చేసేవాడు. పిల్లలను కష్టపడి చదివించాడు. గ్రామంలోని ఒక చిన్న పాఠశాల నుంచి కుమావున్ విశ్వవిద్యాలయానికి హన్సీ ప్రహరి రావడంతో ఆమెపై ప్రతి ఒక్కరికి అంచనాలు పెరిగాయి. హన్సీ ప్రహరి అధ్యయనాలు మరియు రచనలతో పాటు ఇతర కార్యకలాపాల్లో పాల్గొనేది. కుమావున్ విశ్వవిద్యాలయంలో స్టూడెంట్స్ యూనియన్ ఉపాధ్యక్షురాలిగా పనిచేసింది. 1998-99 సంవత్సరంలో హన్సీ ప్రహరి వెలుగులోకి వచ్చింది.



హన్సీ విశ్వవిద్యాలయంలో 4 సంవత్సరాల లైబ్రేరియన్ కూడా:

హన్సీ ప్రహరి విశ్వవిద్యాలయంలో దాదాపు నాలుగు సంవత్సరాలు పనిచేసింది. విశ్వవిద్యాలయంలో విద్యకు సంబంధించిన అన్ని పోటీలలో పాల్గొన్నందున ఆమెకు ఆ ఉద్యోగం వచ్చింది. డిబేట్‌లు లేదా సంస్కృతి కార్యక్రమాలు లేదా ఇతర కార్యక్రమాల్లో ఆమె మొదటి స్థానంలో ఉండేది. దీని తరువాత, ఆమె 2008 వరకు అనేక ప్రైవేట్ ఉద్యోగాలు కూడా చేశారు. 2011 తరువాత, హన్సీ ప్రహరి జీవితం అకస్మాత్తుగా మారిపోయింది. ఆమె గతంలో.. కేంద్ర మాజీ మంత్రి, ప్రస్తుత ఎంపీ అజయ్‌ టమ్‌టాకు వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే తర్వాత ఏం జరిగింది అనేది స్పష్టంగా చెప్పడానికి ఆమె నిరాకరించింది. పెళ్లి చేసుకున్న తర్వాత గొడవలు కారణంగా ఆమె జీవితం మారిపోయింది. ప్రస్తుతం గడుపుతున్న జీవితంలోకి వచ్చేసింది.



వైవాహిక జీవితంలో గందరగోళం తరువాత, హన్సీ ప్రహరి కొంతకాలం నిరాశకు గురైంది. తర్వాత ధర్మనాగ్రిలో స్థిరపడి హరిద్వార్ చేరుకున్నారు. అప్పటి నుంచి, తన కుటుంబం నుంచి విడిపోయి.. తన కొడుకుతో కలిసి బతకడం ప్రారంభించింది. ఆమె శారీరక పరిస్థితి కూడా గందరగోళంలో పడటంతో, ఎక్కడా ఉద్యోగం చేయలేకపోయినట్లు ఆమె చెప్పింది. అయితే, శారీరక సమస్యలకు చికిత్స పొందినట్లయితే, ఆమె జీవితం తిరిగి ట్రాక్‌లోకి వస్తుందని భావిస్తున్నారు.



ముఖ్యమంత్రికి లేఖలు:
2012 నుండి ఆమె.. తన ఆరేళ్ల బిడ్డతో కలిసి హరిద్వార్‌లో భిక్షం అడుక్కోవడం ద్వారా పెంచుకుంటున్నట్లు హన్సీ ప్రహరి తెలిపింది. సమయం దొరికినప్పుడల్లా, ఇంగ్లీష్ మాట్లాడే హన్సీ ప్రహరి తన కొడుకుకు ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం మరియు అన్ని భాషలను బోధించింది. ఆమె కోరిక ఏమిటంటే, వారి పిల్లలు చదవడం మరియు వ్రాయడం ద్వారా మంచి జీవితాన్ని గడపాలి. అంతే కాదు, తనకు సహాయం చేయమని ఆమె స్వయంగా ముఖ్యమంత్రికి అనేకసార్లు లేఖలు రాసింది. సెక్రటేరియట్ చుట్టూ తిరిగింది. కానీ సహాయం అందలేదు.. ప్రభుత్వం సహాయం చేస్తే, ఆమె పిల్లలకు మంచి విద్యను అందించాలని భావిస్తుంది.