ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పండిట్ దీన్ దయాల్ అంత్యోదయ భవన్ లోని సీజీవో కాంప్లెక్స్ లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది 25 ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. బుధవారం(మార్చి-6) ఉదయం 8.30గంటల ప్రాంతంలో 5వ ఫ్లోర్లో మంటలు చెలరేగాయి.
కేంద్ర మంత్రిత్వ శాఖలకు సంబంధించిన కీలక కార్యాలయాలు అన్నీ ఈ కాంప్లెక్స్ లోనే ఉన్నాయి. పర్యావరణ శాఖకు చెందిన విభాగంలో ఈ అగ్నిప్రమాదం సంభవించినట్టు తెలుస్తోంది. అగ్నిప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. షార్ట్ సర్క్యూట్ కారణమా అనే కోణంలో దర్యాఫ్తు చేపట్టారు. గతంలో ఈ బిల్డింగ్ ను పర్యావరణ్ భవన్ గా పిలిచేవారు. ఇది 11 అంతస్తుల భవనం.
#Visuals: Fire breaks out on the 5th floor of Pandit Deendayal Antyodaya Bhawan at CGO Complex; 24 fire tenders present at the spot. #Delhi pic.twitter.com/5csHdEfMiU
— ANI (@ANI) March 6, 2019