కరోనా మహమ్మారి ఎన్నో కష్టాలను తెచ్చిపెడుతోంది. ఈ వైరస్ కు గురైన వ్యక్తికి చికిత్స..రోగం వ్యాప్తి చెందకుండా..చేయడం..దగ్గరి నుంచి.. చనిపోయిన వారి మృతదేహాలకు అంత్యక్రియలు చేసే వరకు ఎన్నో క్లిష్టమైన సమస్యలు ఎదుర్కొనాల్సి వస్తుంది. ప్రధానంగా మరణించిన వారి మృతదేహాలకు సాధారణ పద్ధతుల మాదిరిగా అంత్యక్రియలు నిర్వహించే ఛాన్స్ లేదు.
ఐసోలేషన వార్డు నుంచి శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించే వరకు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గదర్శకాలను రూపొందించింది. వీటిని తు.చ తప్పకుండా ఫాలో కావాల్సిందే. ఐసోలేషన్ వార్డులు, మార్చురీ, అంబులెన్స్, శ్మశాన వాటికలో విధులు నిర్వహించే వారు ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటారు. దీనితో పాటు..రక్షణ చర్యలు పాటించాల్సి వస్తుంది.
పరిశుభ్రత తప్పనిసరి :-
వైద్య సిబ్బంది శుభ్రత పాటించాలి. వ్యక్తిగత రక్షణ పరికరాలు వినియోగించాలి. ఆప్రాన్, గ్లౌజ్స్, మాస్కు, కళ్లజోడు తప్పనిసరి. పేషెంట్ వాడిన బట్టలు, ఇతర వస్తువులను హైపోక్లోరైట్ ద్రావణంతో శుభ్రం చేయాలి. బయోమెడికల్ వేస్ట్ నిబంధనలు పాటించాలి. ఇక్కడ శవ పరీక్షలు నిర్వహించరాదనే నిబంధన ఉంది.
డెడ్ బాడీని ప్రత్యేకంగా తయారు చేసిన ప్లాస్టిక్ బ్యాగులో ఉంచాలి. బ్యాగ్ వెలుపలి భాగాన్ని ఒక శాతం హైపో క్లోరైట్ తో శుభ్రం చేయాలి. డెడ్ బాడీని తరలించే వాహనాన్ని ఒక శాతం సోడియం హైపో క్లోరైట్ ద్రావణంతో శుభ్రం చేయాలి. బాడీని ఉంచిన బ్యాగ్ జిప్ ను ముఖం వరకు తెరిచి ఉంచాలి. సంబంధికులను కడసారి చూసేందుకు అనుమతించవచ్చు. శరీరాన్ని తాకవద్దు. మతపరమైన ప్రార్థనలకు అనుమతించవచ్చు. కానీ స్నానం చేయడం, మృతదేహాన్ని ముట్టడం చేయరాదు.
శ్మశాన వాటికలో ఉండే సిబ్బందితో పాటు బంధువులు చేతులు శుభ్రం చేసుకోవాలి. సామాజిక దూరం పాటించాలి. ఎక్కువ మంది గుమికూడవద్దు. పాటించాల్సిన పద్దతులపై వారికి వివరించాలి. ఐసోలేషన్ రూమ్ నుంచి తరలించే ముందు రోగి కుటుంబసభ్యులు చూడాలని అనుకుంటే..తగిన జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
ఐసోలేషన్ ప్రాంతంలో ఉన్న అన్నీ వస్తువులను హైపోక్లోరైట్ ద్రావణంతో శుభ్రం చేయాలి. డెడ్ బాడీని సుమారు 4 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద కోల్డ్ చాంబర్ లో్ ఉంచాలి. మృతదేహాన్ని ఎంబామింగ్ కు అనుతించరాదు.
Also Read | ఏపీలో రూ.వెయ్యి ఇచ్చేది రేపటి నుంచే!