INDIA Alliance : ఆ టీవీ షోలు, ఆ యాంకర్లను బహిష్కరించాలని నిర్ణయించిన ఇండియా కూటమి

కొందరు టీవీ యాంకర్లు, కొన్ని టీవీ షోలను బహిష్కరించాలని ఇండియా కూటమి నిర్ణయించింది. త్వరలోనే జాబితాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. కారణం ఏంటంటే?

New Delhi

INDIA Alliance : నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ ఇంట్లో  భారత సమన్వయ కమిటీ తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో  కొంతమంది యాంకర్లు, టీవీ షోలను బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన జాబితాను త్వరలో వెల్లడించనున్నట్లు ప్రకటించారు.

Sanatana Dharma Row: సనాతన ధర్మ వివాదంపై ఇండియా కూటమిలో తలో మాట.. ఎన్నికల నాటికి కూటమి ఉంటుందా?

ఇండియా కూటమి కొంతమంది యాంకర్లు, టీవీ షోలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించింది. మీడియాలోని ఒక విభాగం పక్షపాతం చూపిస్తోందని పదే పదే ప్రతిపక్షం ఆరోపిస్తోంది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా మీడియాలోని ఒక వర్గం తమకు తక్కువ కవరేజీ ఇస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. యాత్రను ఎడిటర్లు బహిష్కరించారని, కొందరు నేతల సూచనలతో మెయిన్ స్ట్రీమ్ ఛానెల్స్ పనిచేస్తున్నాయని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. మే 2019 లో కాంగ్రెస్ కూడా ఒక నెలపాటు టెలివిజన్ షోలను బహిష్కరించింది. ఒక నెలపాటు టెలివిజన్ చర్చలకు అధికార ప్రతినిధులను పంపకూడదని అప్పట్లో నిర్ణయించింది.

INDIA bloc: ఇండియా కూటమి భారీ నిర్ణయం.. భోపాల్ నుంచి పోరు ప్రారంభం

మరోవైపు వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సీట్ల పంపకాల ప్రక్రియను కూడా ప్రారంభించాలని సమన్వయ కమిటీ నిర్ణయం తీసుకుంది.

ట్రెండింగ్ వార్తలు