కరోనా వైరస్, జీఎస్టీ, నోట్ల రద్దు అమలులో ప్రభుత్వ వైఫల్యం భవిష్యత్లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్ కేస్ స్టడీగా మారుతుందంటూ రాహుల్ వ్యంగ్యాస్త్రాలను ఆ ట్వీట్ లో తెలిపారు. లాక్డౌన్ సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగాలను ఎద్దేవా చేస్తూ ఓ వీడియోను కూడా పోస్టు చేశారు.
ఈ వీడియోలో మహాభారత యుద్ధంలో పాండవులు 18 రోజుల్లో గెలిచారని, కరోనాకు వ్యతిరేకంగా జరిగే యుద్ధంలో దేశం 21 రోజుల్లో విజయం సాధిస్తుందన్న ప్రధాని మాటలను ఆయన పోస్ట్ చేశారు. కరోనావైరస్ కేసుల పెరుగుదలకు సంబంధించిన గ్రాఫ్ను వీడియోలో చూడవచ్చు.