Lockdown In Maharashtra Again Rule Change Timing For Grocery Vegetable Fruit Vendor
మహారాష్ట్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 రాత్రి 8 గంటల నుండి మే 1 ఉదయం 7 గంటల వరకు మహారాష్ట్రలో లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కర్ఫ్యూతో పాటు, అనేక ఇతర ఆంక్షలను విధించింది. ఆ పరిమితులను మంగళవారం మరింతగా పెంచింది. కిరాణా, కూరగాయలు, పండ్లు వంటి సేవలను ముఖ్యంగా ఉదయం 7 నుండి 11 వరకు అందించాలని నిర్ణయించారు. ఈ నిబంధనలు ఏప్రిల్ 20 న రాత్రి 8 నుండి అమలు అవుతాయని వెల్లడించింది.
కొత్త పరిమితులు ఏమిటి?
కొత్త ఆంక్షలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్తర్వులను జారీ చేసింది.
1. అన్ని కిరాణా దుకాణాలు, కూరగాయల దుకాణాలు, పండ్ల దుకాణాలు, డెయిరీలు, బేకరీలు, అన్ని రకాల ఆహార దుకాణాలు, మాంసం దుకాణాలు, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన దుకాణాలు, జంతు ఆహారాన్ని విక్రయించే దుకాణాలు, రెయిన్ గేర్ విక్రయించే దుకాణాల(గొడుగులు, రెయిన్ కోట్లు, టార్పాలిన్లు మొదలైనవి)కు ఉదయం 7 నుండి 11 వరకు అనుమతి ఇచ్చింది.
2.అలాగే, పైన పేర్కొన్న అన్ని దుకాణాల నుండి హోమ్ డెలివరీ ఉదయం 7 నుండి రాత్రి 8 వరకు కొనసాగడానికి అనుమతి ఉంది.
3. ఏదైనా సేవ లేదా సదుపాయాన్ని అవసరమైన సేవలు లేదా సౌకర్యాలలో చేర్చాలనుకుంటే, రాష్ట్ర విపత్తు నిర్వహణ అనుమతి పొందడం తప్పనిసరి.
4. పైన పేర్కొన్న కొత్త మార్పులు మినహా మిగతా అన్ని ఆంక్షలు ఏప్రిల్ 13 న ప్రకటించిన ఆంక్షలకు అనుగుణంగా ఉంటాయి.