కొత్తగా కొన్న కారుపై తన చిన్నారికూతురి పాదముద్రలు వేయించుకున్న వ్యక్తిపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ‘‘నా చిట్టితల్లే నాకు లక్ష్మీదేవి’’అంటున్న నగేశ్ పాటిల్ ను మెచ్చుకోకుండా ఉండలేం. మహారాష్ట్రలోని కొల్హాపూర్ వాసి నగేశ్ పాటిల్ పుణెలోని ఓ ప్రైవేటు సంస్థలో డ్రైవర్గా పనిచేస్తున్నారు. నగేశ్ ఇటీవలే కొత్త కారు కొన్నాడు. కొత్తకారుకు పూజలు చేయించాడు.
తరువాత లక్ష్మీదేవి గుర్తుగా తన రెండు సంవత్సరాల కుమార్తె పాదాలను కుంకుమలో ముంచి కారు బ్యానెట్పై ఆ ముద్రలు వేసుకున్నాడు. వెండి మువ్వల పట్టీలు పెట్టుకున్న చిన్నారి తల్లి పాదాలో కారుపై ముద్రలు వేయించుకున్న నగేశ్ వాటినిచూసి తన బిడ్డను చూసి మురిసిపోయాడు. ఈ దృశ్యాలను వీడియో తీసి ట్విటర్లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో చూసిన అందరూ నగేశ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా నగేశ్ కు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
మహారాష్ట్ర మాజీ సీఎం, ప్రస్తుత మంత్రి అశోక్ చవాన్ సైతం ఆ వీడియో చూశారు. చూసిన తరువాత స్వయంగా నగేశ్కు ఫోన్ చేసి ప్రశంసించారు. ఈ వీడియోను చూసి చాలా సంతోషించాను..నా హృదాన్ని తాకింది అంటూ అభినందించారు.
గతంలో ఆడపిల్ల పుడితే ఇంటిలో లక్ష్మీదేవి పుట్టిందని సంబరాలు చేసుకునేవారు. కానీ ప్రస్తుత సమాజంలో ఆడపిల్ల పుట్టుకనే ప్రశ్నార్థం చేసేస్తున్న ఈ రోజుల్లో నగేశ్ పాటిల్ తన బిడ్డలనే లక్ష్మీదేవిగా భావించి చిట్టితల్లి పాదముద్రల్ని కారుపై వేయించుకోవటం నిజంగా అభినందనీయం. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
मोबाईलवर हा VDO नजरेस पडला. मन भरून आलं. खूप कौतूक वाटलं त्या पित्याचं जो आपल्या नव्या गाडीची पूजा मुलीच्या पदस्पर्शाने करतोय.
दोन मुलींचा बाबा असल्याने बाप-लेकीचं नातं काय असतं, त्यातील ओलावा काय असतो, याची मला जाणीव आहे. या बाप-लेकीला भेटायला मला नक्कीच आवडेल! pic.twitter.com/eDYBdBLfFk— Ashok Chavan (@AshokChavanINC) January 7, 2020