పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోడీ.. ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ సహా లెఫ్ట్ పార్టీలపై విరుచుకుపడ్డారు. వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టంపై ఆయన ప్రసంగిస్తూ విపక్ష పార్టీ సభ్యులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. లోకసభలో దాదాపు గంటపాటు సుదీర్ఘంగా ప్రసంగించిన మోడీ.. కశ్మీర్ విభజన, ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి ప్రస్తావించారు. ఆర్టికల్ 370ను రద్దు చేయడాన్ని వ్యతిరేకించిన జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలను ఈ సందర్భంగా మోడీ ప్రస్తావించారు.
ఒమర్ అబ్దుల్లా గత ఆరు నెలలుగా గృహ నిర్బంధంలో ఉన్నారు. పార్లమెంటులో మోడీ ప్రసంగం తర్వాత జమ్మూకశ్మీర్ మాజీ సీఎంలు ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ములపై పోలీసులు పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ (PSA) ప్రయోగించడం గమనార్హం. ఈ ఇద్దరు మాజీ సీఎంల నిర్బంధ గడువును పెంచినట్టు గురువారమే అధికారులు వెల్లడించారు.
వాస్తవానికి.. సెటైరికల్ వెబ్ సైట్.. ‘ Faking News ఫేకింగ్ న్యూస్’ వెబ్ సైట్లో వచ్చిన కథనాన్ని ప్రధానమంత్రి మోడీ ఉటంకించారు అంతే.. ‘ఆర్టికల్ 370ని రద్దు చేస్తే అల్లకొల్లోలం (భూకంపం వచ్చి ) ఏర్పడి భారత్ నుంచి కశ్మీర్ ను వేరు చేస్తుంది’ అనే ఈ వ్యాఖ్యను వ్యంగ్య వెబ్సైట్ (మే 28, 2014న) ప్రచురించింది.
BREAKING: Removing Article 370 will cause earthquakes separating Kashmir from India: Omar Abdullah http://t.co/KMHDKKx0LW
— Faking News (@fakingnews) May 28, 2014
Mark my words & save this tweet – long after Modi Govt is a distant memory either J&K won’t be part of India or Art 370 will still exist 2/n
— Omar Abdullah (@OmarAbdullah) May 27, 2014
ఈ కథానాన్ని ప్రచురించడానికి ముందు రోజు, అబ్దుల్లా ఆర్టికల్ 370, మోడీ ప్రభుత్వం గురించి ట్వీట్ చేశారు. ఆర్టికల్ 370 రద్దు చేస్తూ.. జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో భాగం కాదని ఆ ట్వీట్లో ఉంది. మోడీ ప్రస్తావనతో పోల్చితే అబ్దుల్లా.. భూకంపం అనే మాటను ప్రస్తావించలేదు.
ఆ పదం ఫేకింగ్ న్యూస్ కథనంలో మాత్రమే కనిపిస్తోంది. గూగుల్ సెర్చ్ సూచించిన నివేదికల్లో అబ్దుల్లా వ్యాఖ్యల్లో ఏది మోడీ ఉదహరించలేదు.ప్రధాని నరేంద్ర మోడీ ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలను ప్రస్తావించే వీడియోను కూడా పీఎంఓ ఇండియా యూట్యూబ్ ఛానళ్లలో చూడొచ్చు.
అబ్దుల్లా ట్విట్టర్ అకౌంట్ నుంచి వచ్చిన చివరి ట్వీట్ ఆగస్టు 5, 2019న షేర్ అయినట్టుగా ఉంది. ఈ వీడియోను కూడా భారతీయ జనతా పార్టీ తమ అధికారిక ట్విట్టర్ అకౌంట్లో ట్వీట్ చేసింది. పార్లమెంటులో మోడీ చేసిన వ్యాఖ్యలతో పాటు ఒమర్ అబ్దుల్లా ప్రకటించినట్టుగా ఉన్న వ్యాఖ్యలను కూడా బీజేపీ ట్వీట్ చేయడం గమనార్హం.
Omar Abdullah had said that the abrogation of Article 370 would bring a massive earthquake and will divide Kashmir from India.
Farukh Abdullah had said the removal of Article 370 will strengthen the road of freedom for Kashmiris: PM Modi #PMInLokSabha
— BJP (@BJP4India) February 6, 2020
While I’ve been focused on Kashmir I must add a word for people in Kargil, Ladakh & Jammu. I’ve no idea what is in store for our state but it doesn’t look good. I know many of you will be upset by what unfolds. Please don’t take the law in to your own hands, please stay calm.
— Omar Abdullah (@OmarAbdullah) August 4, 2019
ఆరేళ్ల క్రితం సెటైరికల్ వెబ్ సైట్లో కథనాన్ని పార్లమెంటులో మోడీ ఎందుకు ప్రస్తావించారు అనేదానిపై స్పష్టత లేదు. మరోవైపు ఒమర్ అబ్దుల్లా ఇలాంటి ప్రకటన చేసి ఉండకపోవచ్చు అని నేషనల్ కాన్ఫిరెన్స్ ప్రతినిధి ఇమ్రాన్ నభి అభిప్రాయపడ్డారు. ఈ ప్రకటన సెటైరికల్ వెబ్ సైట్ నుంచి వచ్చినదే కావొచ్చు అన్నారు.