×
Ad

Music maestro : మ్యూజిక్ మేస్ట్రో రషీద్ ఖాన్ కేన్సరుతో కన్నుమూత

ప్రముఖ సంగీత విద్వాంసుడు,పద్మ అవార్డు గ్రహీత రషీద్ ఖాన్ కేన్సర్‌తో కన్నుమూశారు. కేన్సరు వ్యాధితో సుదీర్ఘ పోరాటం రషీద్ ఖాన్ కోల్‌కతా ఆసుపత్రిలో మరణించారు....

  • Published On : January 10, 2024 / 05:12 AM IST

Music maestro Rashid Khan

Music maestro : ప్రముఖ సంగీత విద్వాంసుడు,పద్మ అవార్డు గ్రహీత రషీద్ ఖాన్ కేన్సర్‌తో కన్నుమూశారు. కేన్సరు వ్యాధితో సుదీర్ఘ పోరాటం రషీద్ ఖాన్ కోల్‌కతా ఆసుపత్రిలో మరణించారు. అభిమానులు నివాళులర్పించేందుకు వీలుగా మ్యూజిక్ మేస్ట్రో మృతదేహాన్ని కోల్‌కతాలోని పీస్ హెవెన్‌కి పంపనున్నారు. జనవరి 10వతేదీన ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కేన్సర్ కారణంగా కోల్‌కతా ఆసుపత్రిలో ఈయన చాలా కాలంగా చికిత్స పొందారు. అతని వయసు 55 సంవత్సరాలు.

ALSO READ : Ram Mandir : అయోధ్య రామమందిరంలో మొదటి బంగారు తలుపు

గత ఏడాది సెరిబ్రల్ అటాక్‌కు గురైనప్పటి నుంచి రషీద్ ఖాన్ ఆరోగ్యం క్షీణించింది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రషీద్ ఖాన్ మృతి పట్ల ఆమె సంతాపాన్ని తెలిపారు. ఉస్తాద్ రషీద్ ఖాన్ అంత్యక్రియలను అధికార లాంఛనాలతో చేస్తామని సీఎం ప్రకటించారు. రషీద్ ఖాన్ కు భార్య, కుమారుడు అర్మాన్ లున్నారు.

ALSO READ : కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ.. సమగ్రమా? తూతూ మంత్రమా?

ఉస్తాద్ రషీద్ ఖాన్ పార్థివదేహాన్ని కోల్‌కతాలోని రవీంద్ర సదన్‌లో ఉంచి ప్రజలు నివాళులర్పించారు. రషీద్ ఖాన్ భారతీయ శాస్త్రీయ సంగీతానికి చేసిన కృషికి గుర్తింపుగా పద్మశ్రీ, సంగీత నాటక అకాడమీ అవార్డుతో సహా అనేక ప్రశంసలు,అవార్డులను అందుకున్నారు. హిందుస్థానీ శాస్త్రీయ సంగీతంలో మాస్ట్రోగా రషీద్ ఖాన్ కీర్తిని మరింత పెంచింది.