9 Dead Bodies : ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 9 మృతదేహాలు.. అదీ ఒక ఇంట్లోనే లభ్యం అయ్యాయి. మహారాష్ట్రలోని సాంగ్లీలో ఈ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. మహైసాల్ గ్రామంలో ఒకే ఇంట్లో 9 డెడ్ బాడీలు లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది. మూడు మృతదేహాలు ఒక చోట, మరో ఆరు మృతదేహాలు ఇంట్లోనే వేర్వేరు చోట్ల పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. వీరంతా విషం తాగి చనిపోయినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw
ఈ ఘటనకు సంబంధించిన కారణాలపై పోలీసులు దృష్టి సారించారు. పోస్టుమార్టం తర్వాతే పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉందని స్పష్టం చేశారు. అయితే వీరిని ఎవరైనా హత్య చేశారా? లేక వారే ఆత్మహత్య చేసుకున్నారా? అనేది పోస్టుమార్టం నివేదికలో వెల్లడయ్యే అవకాశం ఉంది.
Wife Killed: అన్నం వడ్డించలేదని భార్యను చంపి శవం పక్కనే నిద్రపోయిన భర్త
మానిక్ వాన్మోర్, పోపట్ వాన్మోర్ సోదరులు. చనిపోయిన వారంతా వారి కుటుంబ సభ్యులే. మృతుల్లో తల్లి, భార్య, పిల్లలు ఉన్నారు. సోమవారం ఉదయం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. మృతులను పోపట్ యల్లప్ప వాన్మోర్ (52), సంగీతా పోపట్ వాన్మోర్ (48), అర్చన పోపట్ వాన్మోర్ (30), శుభమ్ పోపట్ వాన్మోర్ (28), మానిక్ యల్లప్ప వాన్మోర్ (49), రేఖ మానిక్ వాన్మోర్ (45), ఆదిత్య మానిక్ వాన్మోర్ (15), అనితా మానిక్ వాన్మోర్ (28), అక్కాటై వాన్మోర్ (72) గుర్తించారు.
Odisha : ప్రేమించిన యువతిని మోసం చేసిన ఎమ్మెల్యే-కేసు పెట్టిన ప్రియురాలు
స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుటుంబీకులంతా ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.