Odisha : ప్రేమించిన యువతిని మోసం చేసిన ఎమ్మెల్యే-కేసు పెట్టిన ప్రియురాలు
పెళ్లి చేసుకుంటానని చెప్పి ఒక యువతితో చాలాకాలంగా సంబంధం పెట్టుకున్న ఎమ్మెల్యే శుక్రవారం రిజిష్ట్రార్ ఆఫీసులో పెళ్లి చేసుకోవటానికి రావాలి. కానీ ఆయన గైర్హాజరు అవటంతో ఆయన ప్రియురాలు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
Odisha : పెళ్లి చేసుకుంటానని చెప్పి ఒక యువతితో చాలాకాలంగా సంబంధం పెట్టుకున్న ఎమ్మెల్యే శుక్రవారం రిజిష్ట్రార్ ఆఫీసులో పెళ్లి చేసుకోవటానికి రావాలి. కానీ ఆయన గైర్హాజరు అవటంతో ఆయన ప్రియురాలు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
ఒడిషాలోని సీనియర్ బీజేడీ నాయకుడు మాజీ మంత్రి దివంగత బిష్ణుదాస్ కుమారుడు బిజయ శంకర్ దాస్, సోమాలికా అనే యువతితో చాలాకాలంగా ప్రేమలో ఉన్నాడు. వీరిద్దరూ మే 17న జగత్ సింగ్ పూర్ లోని సబ్ రిజిష్ట్రార్ కార్యాలయంలో పెళ్లి చేసుకోటానికి దరఖాస్తు చేసుకున్నారు. ఆ దరఖాస్తును పరిశీలించిన అధికారులు జూన్ 17 శుక్రవారం పెళ్లి రిజిష్టర్ చేయటానికి స్లాట్ ఇచ్చారు.
దీంతో శుక్రవారం జూన్ 17వ తేదీ అనుకున్న సమయానికి సోమాలికా రిజిష్ట్రార్ కార్యాలయానికి చేరుకున్నారు. కానీ ఎమ్మెల్యే బిజయ్ శంకర్ దాస్ కానీ, అతని కుటుంబ సభ్యులు కానీ రిజిష్ట్రార్ ఆఫీసుకు రాలేదు. కాగా ఎమ్మెల్యే తనను మోసం చేశాడని ఆరోపిస్తూ సోమాలికా ఈరోజు జగత్ సింగ్ పూర్ పోలీసుస్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
నెల రోజుల క్రితం రిజిష్ట్రార్ ఆఫీసులో పెళ్లి రిజిష్ట్రేషన్ కోసం సంతకం పెట్టటానికి బిజయ్ వచ్చాడని… ఈ నెల రోజుల్లో ఏమైందో తెలియదని సోమాలికా చెప్పారు. ఎమ్మెల్యే సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులు తనను బెదిరిస్తున్నారని ఆమె ఆరోపించింది. ఈ నెల రోజుల్లో తన ఫోన్ కాల్స్ కు కూడా బిజయ్ సరిగా సమాధానం ఇవ్వలేదని… మరోక మహిళతో సంబంధంలో ఉన్నాడని భావిస్తున్నాని సోమాలికా తెలిపింది.