చెక్ చేసుకోండి : రైతుల ఖాతాల్లోకి రూ.2వేలు

పీఎం-కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం. అన్నదాతలకు పెట్టుబడి సాయం కింద నేరుగా నగదు బదిలీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం. ఆదివారం(ఫిబ్రవరి

  • Publish Date - February 24, 2019 / 04:08 AM IST

పీఎం-కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం. అన్నదాతలకు పెట్టుబడి సాయం కింద నేరుగా నగదు బదిలీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం. ఆదివారం(ఫిబ్రవరి

పీఎం-కిసాన్‌ సమ్మాన్‌ నిధి. అన్నదాతలకు పెట్టుబడి సాయం కింద నేరుగా నగదు బదిలీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం. ఆదివారం(ఫిబ్రవరి 24-2019) ప్రధాని నరేంద్ర మోడీ ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో దీన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. రైతుల ర్యాలీలో ఒకే ఒక్క క్లిక్‌తో లక్షలాది మందికి నగదు బదిలీ చేయనున్నారు. తొలి విడతగా యూపీ, కర్ణాటక సహా 14 రాష్ట్రాలకు చెందిన కోటి మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.2వేలు జమ చేయనున్నారు. మరో రెండు మూడు రోజుల్లో మరో కోటి మంది రైతుల ఖాతాల్లో ఈ సొమ్ము జమకానుంది. ఒక్కో రైతుకు ఏడాదికి రూ.6వేలు ఇవ్వనుండగా, మిగిలిన రూ.4వేలు రెండు విడతల్లో జమ చేస్తారు.

దేశవ్యాప్తంగా రైతులకు చేయూతనిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఈ స్కీమ్2ను అనౌన్స్ చేశారు. దీని కోసం రూ.75వేల కోట్లు కేటాయించారు. 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు ఏడాదికి రూ. 6వేలు 3 సమాన వాయిదాల్లో చెల్లిస్తారు. 2018 డిసెంబర్ నుంచే రైతులకు ఈ పథకం వర్తిస్తుందని చెప్పిన కేంద్ర ప్రభుత్వం… ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఇవ్వాల్సిన వాయిదా రూ.2వేలు రైతుల అకౌంట్లలో నేరుగా జమ చేయనుంది.

దేశంలోని అన్ని రాష్ట్రాలకు చెందిన అధికారులు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి అర్హులైన రైతుల బ్యాంకు అకౌంట్ వివరాలను పీఎం కిసాన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. మొదటి వాయిదా పొందేందుకు రైతులు ఆధార్ ప్రూఫ్ చూపించాల్సిన అవసరం లేదు. కానీ ఆ తర్వాత వాయిదాలు తీసుకోవాలంటే మాత్రం ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి అని కేంద్రం కండీషన్ పెట్టింది.