Covid-19తో పోరాటంలో సీఎంలకు పీఎం మెసేజ్‌

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం ముఖ్యమంత్రులతో నాలుగో సారి వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా మాట్లాడారు. జాతీయ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను 3వ తేదీ వరకూ ఉంచాలా..

Pm Modi

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సోమవారం ముఖ్యమంత్రులతో నాలుగో సారి వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా మాట్లాడారు. జాతీయ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను 3వ తేదీ వరకూ ఉంచాలా.. తొలగించాలా అనే దానిపై చర్చించారు. హాట్ స్పాట్ ప్రాంతాల్లో లాక్‌డౌన్ నియమాలు తప్పక పాటించాలని, రెడ్ జోన్ ప్రాంతాలను ఆరెంజ్ ప్రాంతాలుగా మార్చాలంటూ సూచించారు. అక్కడ కూడా తీవ్రతను తగ్గించి గ్రీన్ జోన్లుగా మార్చాలని పిలుపునిచ్చారు.

లాక్‌డౌన్ మాట అటుంచి మోడీ ప్రభుత్వం ఎకానమీని తిరిగి నిలబెట్టుకునే ప్రక్రియలో భాగంగా ప్రణాళికలు చెప్పారు. విదేశాల్లో ఉన్న భారతీయులు, వలస కార్మికులు కొవిడ్ 19ను ఎదుర్కొంటున్న తీరును వివరించారు. భారత్ మొత్తం కరోనావైరస్‌ను అడ్డుకునే క్రమంలో మార్చి 25నుంచి పూర్తి స్థాయి లాక్‌డౌన్‌లోకి వెళ్లిపోయింది.

లాక్‌డౌన్ ఆర్థిక వ్యవస్థను కుదేలయ్యేలా చేసింది. చాలా దేశాలు భారత్ కంటే చిన్నవే. మహమ్మారి ధాటికి అవి కూడా నష్టపోయాయి. వైరస్ ప్రమాదాన్ని భారత్ నుంచి దూరం చేశాం. రాష్ట్రాలన్నీ ఆర్థికంగా పుంజుకోవడానికి కష్టపడాలని.. అదే సమయంలో వైరస్ వ్యాప్తి కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.

మేఘాలయ సీఎం కన్రాడ్ సంగ్మా పీఎం మోడీ మెసేజ్ గురించి చెప్తూ లాక్ డౌన్ రిలాక్సింగ్ ఇచ్చినప్పటికీ మైండ్ సెట్ లో మాత్రం మార్పులు రాకూడదని చెప్పారు. త్వరగా ప్రభుత్వాలు పుంజుకోవాలని.. మనమంతా ధైర్యంగా ఉండి సామాన్య పౌరుల ప్రాణాలను కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. పీఎం మనసులో ఉన్న ఆలోచనలు మాత్రం లాక్‌డౌన్ పూర్తయినా మారవని చెప్పారు.

వలస కార్మికులపై ముఖ్యమంత్రులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. వారిని జాగ్రత్తగా చూసుకోకపోతే సొంతూళ్లకు వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తారని.. అలా వైరస్ ఒకచోట నుంచి మరొక చోటికి వ్యాప్తి చెందుతుందని సూచించారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాకరే ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసి వలస కార్మికులను సొంతూళ్లకు పంపాలని అడుగుతూనే ఉన్నారు. ఇతర ముఖ్యమంత్రులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి వారిని పంపించాలని విజ్ఞప్తి చేశారు.

కేంద్ర ఆమోదాన్ని తిరస్కరించకుండానే పీఎం మోడీ మెసేజ్ ఇచ్చారు. రాష్ట్రాలు ఫ్యాక్టరీలను, పరిశ్రమలను వలస కార్మికులు లేకుండా ఎలా పని చేయించాలో వివరించారు. విదేశాల్లో ఇరుక్కున్న భారతీయులను తీసుకొచ్చి ఇక్కడ క్వారంటైన్లో ఉంచుతామని మోడీ చెప్పారు. వారందరినీ క్వారంటైన్ సెంటర్లలో ఉంచి చూసుకోవాలని రాష్ట్రాలకు ఆదేశించారు.

వలస కార్మికులు తమ కుటుంబాల గురించి భయపడవద్దని.. వారి కోసం రిస్క్ చేసి ప్రయాణాలు చేయవద్దని సూచించారు. కొవిడ్ 19తో పోరాడేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేసిన తీరును ప్రశసించారు. కేంద్రం, రాష్ట్రాలు కలిసి వైరస్ వ్యాప్తిని అడ్డుకున్నాయని చెప్పారు. ఒక రాష్ట్రం ఆర్థికంగా నష్టపోయినా దేశం మొత్తం నష్టపోయినట్లే. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమ రాష్ట్రంలోకి కేంద్రం నుంచి వచ్చిన టీంను అడ్డుకున్న సందర్భంగా ఈ విధమైన కామెంట్లు చేశారు.