పంజాబ్ సీఎంకి ప్రధాన సలహాదారుగా పీకే నియామకం

Prashant Kishor వచ్చే ఏడాది పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ ను అమరీందర్ సింగ్ తన సలహాదారుగా నియమించుకున్నారు. ఈ విషయాన్ని సీఎం స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

సోమవారం పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ చేసిన ట్వీట్ లో…ప్రశాంత్‌ కిషోర్‌ ప్రధాన సలహాదారుగా నాతో చేరిన విషయాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. పంజాబ్ ప్రజల శ్రేయస్సు కోసం కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నాం అని అమరీందర్ తన ట్వీట్ లో పేర్కొన్నారు. కాగా, 2017 పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో అమరీందర్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ కు ప్రశాంత్‌ కిషోర్‌ వ్యూహకర్తగా నిలిచి పార్టీ ఘన విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు