Nagrota Army Station : జమ్మూలో హై అలర్ట్.. నగ్రోటాలో ఆర్మీ యూనిట్పై కాల్పులు.. భారత జవాన్కు గాయాలు..!
Nagrota Army Station : జమ్మూలోని నగ్రోటా ఆర్మీ స్టేషన్ వద్ద కాల్పుల్లో సైనికుడికి గాయాలయ్యాయి. చొరబాటుదారుడి కోసం గాలింపు చర్యలు చేపట్టింది భారత ఆర్మీ.
- Sreehari A
- Published On : May 11, 2025 / 12:08 AM IST
Nagrota Army Station
Nagrota Army Station : జమ్మూ సమీపంలోని నాగ్రోటా ఆర్మీ స్టేషన్ వద్ద కాల్పుల ఘటన జరిగింది. ఆర్మీ స్టేషన్లో సిబ్బందిపై చొరబాటుదారుడు కాల్పులు జరపడంతో ఒక భారత సైనికుడికి గాయాలయ్యాయి. ఈ మేరకు వైట్ నైట్ కార్ప్స్ ఒక ప్రకటనలో తెలిపింది.
“చుట్టుపక్కల సమీపంలో అనుమానాస్పద కదలికలను గమనించిన వెంటనే నగ్రోటా మిలిటరీ స్టేషన్లోని సెంట్రీ అప్రమత్తమైంది. ఫలితంగా చొరబాటుదారుడితో కొద్దిసేపు భారత ఆర్మీ కాల్పులు జరిపింది. ఈ క్రమంలోనే సెంట్రీకి స్వల్ప గాయం అయింది.
చొరబాటుదారుడిని పట్టుకునేందుకు భద్రతా దళాలు గాలింపు చర్యలు తీవ్రంగా కొనసాగుతున్నాయి” అని ఆర్మీ ట్వీట్ చేసింది. ఆర్మీ వర్గాల ప్రకారం.. ప్రారంభ కాల్పుల తర్వాత ఎటువంటి సంప్రదింపులు జరగలేదు.
ఈ కాల్పుల ఘటన నగ్రోటాతో సహా నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి అనేక ప్రాంతాలలో పాకిస్తాన్ డ్రోన్ దాడులు, ఫిరంగి దాడులు ఏకకాలంలో జరిగాయి. భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతలను తగ్గించడానికి కాల్పుల విరమణ అంగీకారం తెలిపిన కొన్ని గంటల తర్వాత ఈ ఉద్రిక్తత సంభవించింది.
జమ్మూ కాశ్మీర్లోని వివిధ రంగాలలో అంతర్జాతీయ సరిహద్దు (IB), నియంత్రణ రేఖ (LoC) వెంబడి పాకిస్తాన్ శనివారం సాయంత్రం పలుసార్లు కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడినట్లు నివేదించడంతో బ్లాక్అవుట్ తిరిగి ప్రారంభమైంది.
భద్రతా వర్గాల ప్రకారం.. ఎలాంటి రెచ్చగొట్టకుండా సరిహద్దులో ప్రతీకారం తీర్చుకోవాలని సరిహద్దు భద్రతా దళం (BSF)ని ఆదేశించినట్లు తెలుస్తోంది.
Read Also : Motorola Edge 50 Pro : ఖతర్నాక్ డిస్కౌంట్.. రూ. 42వేల మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో కేవలం రూ. 18వేలు మాత్రమే..!
రాత్రి 8 గంటల తర్వాత పాక్ కాల్పుల ఉల్లంఘనలు ప్రారంభమయ్యాయి, పాకిస్తాన్ పాల్వాన్, ఘనచక్తో సహా ఐబీ సమీపంలోని ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుంది. ఆర్ఎస్ పురా సెక్టార్తో సహా జమ్మూలోని అనేక ప్రాంతాలలో సరిహద్దు అవతల నుంచి తీవ్రమైన కాల్పులు జరిగాయి.
