PM Kisan : పీఎం కిసాన్ బిగ్ అప్‌డేట్.. జూన్ ఫస్ట్ వీక్‌లో రూ. 2వేలు పడొచ్చు? రైతులు ఇప్పుడే ఇవి పూర్తి చేయండి..!

PM Kisan : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అప్‌డేట్.. 20వ విడత డబ్బులు వచ్చే జూన్ మొదటివారంలో పడే అవకాశం ఉంది. రైతులు ఈలోగా కొన్ని పనులు పూర్తి చేయాలి.

PM Kisan : పీఎం కిసాన్ బిగ్ అప్‌డేట్.. జూన్ ఫస్ట్ వీక్‌లో రూ. 2వేలు పడొచ్చు? రైతులు ఇప్పుడే ఇవి పూర్తి చేయండి..!

PM Kisan 20th Installment

Updated On : May 10, 2025 / 11:13 PM IST

PM Kisan : పీఎం కిసాన్ రైతులకు బిగ్ అలర్ట్.. ప్రధానమంత్రి కిసాన్ యోజనకు సంబంధించి కీలక అప్‌డేట్ వెల్లడైంది. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రారంభించి 6 సంవత్సరాలు గడిచాయి.

Read Also : Hero Splendor Plus : కొంటే ఇలాంటి బైక్ కొనాలి.. సరసమైన హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్ ఇదిగో.. 70కి.మీ బెస్ట్ మైలేజీ..!

రైతులకు ఏటా 6 వేల రూపాయలను కేంద్రం అందిస్తోంది. ప్రతి 4 నెలలకు 3 వాయిదాలలో రూ. 2 వేలు అకౌంట్లలో జమ చేస్తోంది. ఈ నగదు DBT బదిలీ ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతుంది.

ఇప్పటివరకు, ప్రధానమంత్రి కిసాన్ యోజన 19 వాయిదాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పుడు రైతులు తదుపరి విడత కోసం ఎదురు చూస్తున్నారు.

జూన్ మొదటి వారంలో రైతులు ప్రధానమంత్రి కిసాన్ యోజన 20వ విడతను పొందుతారు. రైతు రిజిస్ట్రేషన్ పూర్తయిన రైతులకు మాత్రమే 20వ విడత విడుదల అవుతుంది.

అర్హత ఉన్న రైతులందరినీ ఈ పథకంతో ఇంటిగ్రేట్ చేసేందుకు మే 31 వరకు అవకాశం ఉంటుంది. పీఎం కిసాన్ 20వ విడత కోసం లబ్ధిదారు రైతులు కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ఇందులో ఈ-కేవైసీ, ల్యాండ్ వెరిఫికేషన్, బ్యాంక్ అకౌంట్-ఆధార్ లింక్ చేయడం వంటివి ఉన్నాయి.

  • ముందుగా, పీఎం కిసాన్ (pmkisan.gov.in) అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
  • రైతు (Farmer Corner)కి వెళ్లి e-KYC ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
  • ఆధార్ నంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
  • వెరిఫికేషన్ తర్వాత మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. OTPని ఎంటర్ చేయండి
  • e-KYC పూర్తవుతుంది.
  • రైతు ఖాతాలో NPCI పూర్తి చేసుకోవాలి.
  • NPCI లింక్ కోసం మీ బ్యాంక్ పాస్‌బుక్, ఆధార్ కార్డుతో మీ సమీప బ్యాంక్ శాఖను సంప్రదించవచ్చు.

ల్యాండ్ వెరిఫికేషన్ ఎలా? :
మీ సమీపంలోని వ్యవసాయ శాఖ కార్యాలయానికి వెళ్లండి. దరఖాస్తు ఫారమ్ తీసుకొని అవసరమైన డాక్యమెంట్లను సమర్పించండి.

Read Also : Motorola Edge 50 Pro : ఖతర్నాక్ డిస్కౌంట్.. రూ. 42వేల మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో కేవలం రూ. 18వేలు మాత్రమే..!

ఇందులో మీ పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నంబర్, వ్యవసాయ సంబంధిత పత్రాలు మొదలైనవి ఉండవచ్చు. దరఖాస్తు, పత్రాలను పరిశీలించిన తర్వాత ఎంపిక చేస్తారు. మీ దరఖాస్తు ఆమోదం పొందితే మీకు భూమిని అప్పగిస్తారు.