ఉత్తరాఖండ్లోని రిషికేశ్, రామ్ ఝూలా ప్రాంతంలో రెండు ఎద్దులు బ్యాగులు అమ్మే దుకాణంలోకి వెళ్లి కుమ్మేసుకున్నాయి. దీంతో ఆ దుకాణంలోని ఇద్దరు అమ్మాయిలకు గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. రెండు ఎద్దులు కుమ్ముకుంటూ దుకాణంలోకి వెళ్లిపోయాయి.
అందులోని ఇద్దరు అమ్మాయిలు భయపడుతూ కార్నర్లోకి వెళ్లి నక్కి నిలబడ్డారు. మొదట బర్రెలను చూసి ఆ అమ్మాయిలు నవ్వకున్నారు. కొద్దిసేపటి తర్వాత ఎద్దులు ఆ అమ్మాయిల వద్దకు వెళ్లాయి. ఆ ఇద్దరమ్మాయిలు తప్పించుకునే పరిస్థితి లేకుండా పోయింది. వారికి ఎద్దులు తగలడంతో ఇద్దరూ కిందపడిపోయారు. వారిని ఎద్దులు కాళ్లతో తొక్కేశాయి.
ఈ వీడియోను జర్నలిస్ట్ నైనా యాదవ్ పోస్ట్ చేశారు. దుకాణంలో ఉంచిన కొన్ని వస్తువులు ఆ అమ్మాయిలపై పడడంతో ఎద్దులు తొక్కినప్పటికీ వారికి ప్రాణాపాయ ముప్పు కలగలేదని చెప్పారు. రామ్ ఝూలా ప్రాంతంలో జంతువులు ఇటువంటి సమస్యలను సృష్టిస్తున్నాయని స్థానికులు అంటున్నారు.
दो सांडों की लड़ाई में दोनों लड़कियों की जान पर बन आई। गनीमत रही दुकान में रखा सामान लड़कियों पर गिरा जिससे वो बच गईं,वीडियो ऋषिकेश में मुनिकिरेती राम झूले का है।
यहां के लोगों ने कई बार आवारा पशुओं की समस्या प्रशासन से की लेकिन कुछ हुआ नहीं।@pushkardhami @uttarakhandcops pic.twitter.com/TZHNo5tCPM— Naina Yadav (@NAINAYADAV_06) July 12, 2024
Also Read: కిడ్నాప్ చేసి.. ఫాంహౌస్లో బంధించి, కుక్కలను వదిలి హింసించిన ల్యాండ్ మాఫియా