దుకాణంలోకి దూసుకెళ్లిన ఎద్దులు.. ఇద్దరమ్మాయిలకు గాయాలు

అందులోని ఇద్దరు అమ్మాయిలు భయపడుతూ కార్నర్‌లోకి వెళ్లి నక్కి నిలబడ్డారు.

ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌, రామ్ ఝూలా ప్రాంతంలో రెండు ఎద్దులు బ్యాగులు అమ్మే దుకాణంలోకి వెళ్లి కుమ్మేసుకున్నాయి. దీంతో ఆ దుకాణంలోని ఇద్దరు అమ్మాయిలకు గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. రెండు ఎద్దులు కుమ్ముకుంటూ దుకాణంలోకి వెళ్లిపోయాయి.

అందులోని ఇద్దరు అమ్మాయిలు భయపడుతూ కార్నర్‌లోకి వెళ్లి నక్కి నిలబడ్డారు. మొదట బర్రెలను చూసి ఆ అమ్మాయిలు నవ్వకున్నారు. కొద్దిసేపటి తర్వాత ఎద్దులు ఆ అమ్మాయిల వద్దకు వెళ్లాయి. ఆ ఇద్దరమ్మాయిలు తప్పించుకునే పరిస్థితి లేకుండా పోయింది. వారికి ఎద్దులు తగలడంతో ఇద్దరూ కిందపడిపోయారు. వారిని ఎద్దులు కాళ్లతో తొక్కేశాయి.

ఈ వీడియోను జర్నలిస్ట్ నైనా యాదవ్ పోస్ట్ చేశారు. దుకాణంలో ఉంచిన కొన్ని వస్తువులు ఆ అమ్మాయిలపై పడడంతో ఎద్దులు తొక్కినప్పటికీ వారికి ప్రాణాపాయ ముప్పు కలగలేదని చెప్పారు. రామ్ ఝూలా ప్రాంతంలో జంతువులు ఇటువంటి సమస్యలను సృష్టిస్తున్నాయని స్థానికులు అంటున్నారు.

Also Read: కిడ్నాప్ చేసి.. ఫాంహౌస్‌లో బంధించి, కుక్కలను వదిలి హింసించిన ల్యాండ్ మాఫియా

ట్రెండింగ్ వార్తలు