కిడ్నాప్ చేసి.. ఫాంహౌస్‌లో బంధించి, కుక్కలను వదిలి హింసించిన ల్యాండ్ మాఫియా

MRPS Narender Kidnap Case: వైద్యురాలి సంతకాన్ని ఫోర్జరీ చేసి ఏపీకి చెందిన వ్యక్తికి ల్యాండ్‌ను 3 కోట్ల రూపాయలకు అమ్మేసింది మాఫియా.

కిడ్నాప్ చేసి.. ఫాంహౌస్‌లో బంధించి, కుక్కలను వదిలి హింసించిన ల్యాండ్ మాఫియా

రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో రెండు రోజుల క్రితం ఎమ్మార్పీఎస్ నాయకుడు నరేందర్ అదృశ్యమైన కేసును పోలీసులు ఛేదించారు. నరేందర్‌ను బంధించిన ఫాంహౌస్‌ను పోలీసులు గుర్తించారు. శంషాబాద్ ధర్మగిరిగుట్ట ఆలయానికి సమీపంలో ఫాంహౌస్ ఉంది.

అందులో నిర్వాహకులు గుర్రాలు, కుక్కలను పెంచుతున్నారు. ఇవాళ నరేందర్‌ను ఇంటికి చేరుకున్నారు. ఆయనను కిడ్నాపర్లు దారుణంగా హింసించారు. గండిపేటలోని భూ వివాదమే కిడ్నాప్‌కు కారణమని పోలీసులు అంటున్నారు. ఫాంహౌస్‌లో నరేందర్‌ను రూమ్‌లో వేసి, బయట 20 కుక్కలను వదిలారు కిడ్నాపర్లు. ఫాంహౌస్ ఎవరిది అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

స్పెషల్ టీమ్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ కేసులో పలు విషయాలు బయటపడినట్లు తెలుస్తోంది. గండిపేటలో ఓ మహిళా వైద్యురాలికి సంబంధించిన 2,000 గజాల భూమిని ల్యాండ్ మాఫియా కబ్జా చేసింది. వైద్యురాలి సంతకాన్ని ఫోర్జరీ చేసి ఏపీకి చెందిన వ్యక్తికి ల్యాండ్‌ను 3 కోట్ల రూపాయలకు అమ్మేసింది. అక్కడకు వెళ్లిన నరేందర్‌ను మరో ల్యాండ్ మాఫియా కిడ్నాప్ చేసి శంషాబాద్ తీసుకెళ్లింది. రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో దర్యాప్తు కొనసాగుతోంది.

Also Read: హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షం.. వాహనదారుల ఇబ్బందులు