కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే గబ్బర్ సింగ్ ట్యాక్స్ (GST) ని రద్దు చేస్తామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీఎస్టీ స్థానంలో సరళతరమైన జీఎస్టీని అమలు చేస్తామని మంగళవారం (మార్చి-20,2019) అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్ లో రాహుల్ చెప్పారు. వాయుసేన మెరుపు దాడులను బీజేపీ రాజకీయంగా వాడుకుంటోందని రాహుల్ ఆరోపించారు.
Read Also : అందంగా కన్పించేందుకు : మాయా రోజూ ఫేసియల్ చేయించుకుంటది
అంతకుముందు బెంగళూరులో ఐటీ ఉద్యోగులను ఉద్దేశించి రాహుల్ మాట్లాడారు. ఈ సమయంలో పలువురు నిరసనకారులు రాహుల్ గోబ్యాక్ అనడంతో అలజడి నెలకొంది. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని బీజేపీ తప్పుబట్టింది. శాంతియుతంగా నిరసన చేస్తున్నవారిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డాడరని ఆరోపించింది.
Rahul Gandhi in Itanagar, Arunachal Pradesh: We have decided, as soon as we form the government in 2019 we will remove the Gabbar Singh Tax and give you the GST. pic.twitter.com/cdJK5Kdi6X
— ANI (@ANI) 19 March 2019