Bellam Konda Srinivas : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బెల్లంకొండ శ్రీనివాస్.. భార్యతో కలిసి
హీరో బెల్లం కొండ శ్రీనివాస్ తన భార్య కావ్యా రెడ్డితో (Bellam Konda Srinivas) కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో కొత్త దంపతులు స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వారికి ఆశీర్వచనం చేసి స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు.










