Pavithra Puri : వావ్.. పూరి జగన్నాధ్ కూతురులో ఇంత ట్యాలెంట్ ఉందా? కేదారనాథ్ ఆలయాన్ని గీసిన పవిత్ర పూరి..
రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న పూరి జగన్నాధ్ కూతురు పవిత్ర తాజాగా తన ట్యాలెంట్ ని బయటపెట్టింది. తనకు బొమ్మలు గీసే కళ ఎక్కడా నేర్చుకోకుండానే వచ్చిందని, గత సంవత్సరం కేదారనాథ్ శివుడు కలలోకి వచ్చాడని, ఆ తెల్లారే కలం పెట్టి ఆలయ నమూనాను గీయడం మొదలుపెట్టానని, అది పూర్తయినప్పుడు చాలా ప్రశాంతంగా అనిపించిందని తెలిపింది. పవిత్ర తను గీసిన కేదారనాథ్ ఆలయాన్ని చూపిస్తూ దిగిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది.






Pavithra Puri
