Sree Charani : తెలుగు క్రికెటర్ శ్రీ చరణి.. రెండు నెలలు, లెక్కలేనన్ని జ్ఞాపకాలు.. ఫోటోలు వైరల్..
ఆంధ్రప్రదేశ్కు చెందిన భారత మహిళా క్రికెటర్ శ్రీచరణి (Sree Charani) అంతర్జాతీయ క్రికెట్లో తనదైన ముద్ర వేస్తోంది. ఇటీవల ముగిసిన మహిళల టీ20 ప్రపంచకప్, ఆ తరువాత ఇంగ్లాండ్తో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్లో తనదైన శైలిలో బంతులు వేస్తూ ప్రత్యర్థులను ముప్పు తిప్పలు పెట్టింది. ఇంగ్లాండ్లో ఈ టోర్నీ జరిగింది. మ్యాచ్ల విరామ సమయంలో లండన్లో సహచర ప్లేయర్లతో చక్కర్లు కొట్టింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా లేటెస్టుగా షేర్ చేస్తూ.. 'రెండు నెలలు, లెక్కలేనన్ని జ్ఞాపకాలు' అంటూ రాసుకొచ్చింది









