మరింత యంగ్ గా కనిపిస్తున్న నమ్రత.. ఫొటోలు వైరల్
Namrata Shirodkar: ప్రిన్స్ మహేశ్ బాబు హీరోగా 'వంశీ' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నమ్రత శిరోద్కర్, తెలుగులో మూడు సినిమాలు మాత్రమే చేశారు. సూపర్ స్టార్ మహేశ్ బాబుని పెళ్లి చేసుకున్నాక సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టేసారు. ఈ మధ్యనే మహేశ్ బాబు సినిమా షూటింగ్ కోసం విదేశాలకు వెళితే, ఇందుకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ ‘నిన్ను ఎంతగానో మిస్ అవుతున్నా..' అంటూ చెప్పుకొచ్చారు. ఇవాళ ఇన్స్టాగ్రామ్లో #AboutLastNight అంటూ ఫార్మల్ డ్రెస్లో నమ్రత షేర్ చేసిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.




