ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జనవరి 20 నుంచి

  • Publish Date - January 13, 2020 / 10:04 AM IST

ఏపీ రాజధానిపై ఏదో ఒకటి తేల్చాయనే పక్కా ప్లాన్ తో ఉన్న వైసీపీ సర్కార్ ఆ దిశగా దూకుడు పెంచింది. ఈ నెల  20నుంచి 3 రోజుల పాటు శాసనసభను ప్రత్యేకంగా సమావేశపరచాలని నిర్ణయించింది.  20, 21, 22  తేదీల్లో శాసనసభను సమావేశ పరచాలని అసెంబ్లీ కార్యదర్శికి ప్రభుత్వం సమాచారం పంపింది.

సీఆర్డీఏ చట్ట సవరణ సహా మరో 3 కీలక బిల్లులను ప్రవేశ పెట్టనుంది. రాజధాని అంశంపై సభలో చర్చించే అవకాశముంది.  ఈ సమావేశంలో 3 రాజధానుల అంశంపై చర్చించనున్నారు. రాష్ట్రంలో అభివృధ్ది, పరిపాలనా వికేంద్రీకరణలో భాగంగా  విశాఖ, కర్నూలు, అమరావతిల్లో ప్రతిపాదిత రాజధానుల అంశం, జీఎన్ రావు కమిటీ. బోస్టన్ కన్సల్టెంగ్ గ్రుప్, హైపవర్ కమిటీ ఇచ్చేనివేదికలపై చర్చించనున్నారు. అనంతరం భవిష్యత్తు కార్యాచరణను ప్రభుత్వం ప్రకటించనుంది. 

ట్రెండింగ్ వార్తలు