న్యూజిలాండ్ ప్రధానమంత్రి Jacinda Ardern కేంద్రీయ లెఫ్ట్ లేబర్ పార్టీ చారిత్రక విజయాన్ని సాధించింది. న్యూజిలాండ్ సార్వత్రిక ఎన్నికల్లో జాసిండా ఘన విజయం సాధించారు. కరోనాను విజయవంతంగా అరికట్టడంలో ఆమె చేసిన కృషి, సమర్ధవంతమైన పాలనకుగానూ న్యూజిలాండ్ ప్రజలు ఆమెకు పట్టం కట్టారు. దశాబ్దాల కాలంలో 40ఏళ్ల అర్డెర్న్ లేబర్ పార్టీ తొలి సింగిల్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.
ఓటమిని అంగీకరించిన ప్రధాన ప్రతిపక్ష జాతీయ పార్టీ నేత జుడిత్ కాలిన్స్ ఆర్డెర్న్ను అభినందించారు. తొలి పాలనలో తన హామీలను నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారు.
అప్పుడు జాతీయవాదా పార్టీతో లేబర్ పార్టీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జాసిండా చారిత్రక విజయాన్ని సాధించారు.
ఎన్నికల్లో విజయం అనంతరం ఆక్లాండ్లో తన మద్దతుదారులతో జెసిండా మాట్లాడారు. రాబోయే మూడేళ్ళలో తాను చేయవలసిన పని చాలా ఉందని చెప్పారు. దేశంలోని ఏకసభ్య పార్లమెంటులో 120 స్థానాలకు గానూ 64 స్థానాల్లో లేబర్ పార్టీ విజయం సాధించింది. 1996లో న్యూజిలాండ్ దామాషా ఓటింగ్ విధానాన్ని తీసుకొచ్చింది.
లేబర్ సగానికి పైగా సీట్లు గెలిస్తే.. ఆర్డెర్న్ ప్రస్తుత వ్యవస్థలో మొదటి సింగిల్-పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. లేబర్ 49.0శాతం ఓట్లను కలిగి ఉంది. నేషనల్ పార్టీ కంటే 27శాతం ఓటింగ్ నమోదైంది. ఎన్నికల కమిషన్ 77శాతం బ్యాలెట్లను లెక్కించింది.
80ఏళ్లలో న్యూజిలాండ్ ఎన్నికల చరిత్రలో అతిపెద్ద విజయమని విల్లంగ్టన్ లోని Victoria యూనివర్శిటీకి చెందిన రాజకీయ వ్యాఖ్యాత Bryce Edwards తెలిపారు. లేబర్ పార్టీ విజయంపై ఆర్థిక మంత్రి గ్రాంట్ రాబర్ట్సన్ హర్షం వ్యక్తం చేశారు.