IPL 2025: నిబంధనలు మారాయ్.. ఐపీఎల్‌లో ఆ జట్లకు గుడ్‌న్యూస్ చెప్పిన బీసీసీఐ.. ఇక వాళ్లు రాకపోయినా పర్వాలేదు..

ఐపీఎల్ 2025 సీజన్ లో జరిగే మిగతా మ్యాచ్ లకు బీసీసీఐ పలు నిబంధనలు సడలించింది.

IPL 2025

IPL 2025: భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తల కారణంగా అర్ధంతరంగా ఆగిపోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) మళ్లీ పున: ప్రారంభం అవుతుంది. మే17వ తేదీ (శనివారం) నుంచి తిరిగి ఆరంభం కానున్న ఐపీఎల్ -18సీజన్ జూన్ 3వ తేదీ వరకు కొనసాగనుంది. అయితే, ఈ సీజన్ అర్ధంతరంగా నిలిచిపోవటంతో విదేశీ ఆటగాళ్లు చాలామంది తమ దేశాలకు వెళ్లిపోయారు. వెళ్లిన వాళ్లలో మళ్లీ ఐపీఎల్ లో ఆడేందుకు తిరిగొచ్చేవారి సంఖ్య తక్కువగానే ఉంది.

Also Read: Ravindra Jadeja : చ‌రిత్ర సృష్టించిన ర‌వీంద్ర జడేజా.. ప్ర‌పంచ క్రికెట్‌లో ఒకే ఒక్క‌డు.. క‌పిల్ దేవ్‌, క‌లిస్‌, ఇమ్రాన్ ఖాన్‌ వంటి దిగ్గ‌జాల‌కు సాధ్యం కాలేదు..

ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు వచ్చే నెల 11 నుంచి ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్స్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ ఆడాల్సి ఉండగా.. ఇంగ్లాండ్, వెస్టిండీస్ జట్లకు అంతర్జాతీయ సిరీస్ లు ఉన్నాయి. దీంతో ఆ దేశాల ఆటగాళ్లలో చాలామంది రెండు రోజుల్లో పున:ప్రారంభం అవుతున్న ఐపీఎల్ కు అందుబాటులో ఉండటం లేదు. ఈ పరిణామాలతో ఐపీఎల్ లోని పలు జట్లకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఐపీఎల్ లో ఈ సీజన్ వరకు నిబంధనల్లో మార్పులు చేసింది.

Also Read: Parmanand maharaj : విరాట్ కోహ్లీ దంపతులు ఆశీర్వాదం తీసుకున్న ప్రేమానంద్ జీ మహారాజ్ ఎవరు..? ఆయన గురించి ఫుల్ డీటెయిల్స్ ఇవే..

ఈసారి ఐపీఎల్ అనూహ్య పరిస్థితుల్లో ఆగి, మళ్లీ మొదలవుతున్న నేపథ్యంలో లీగ్ నిబంధనల్లో బీసీసీఐ కీలక మార్పు చేసింది. ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. ఐపీఎల్ లో జట్టు 12వ మ్యాచ్ తరువాత కొత్త ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవడానికి అవకాశం లేదు. గాయం, ఇతర కారణాలతో జట్టు ప్లేయర్ లీగ్ కు దూరమైతే 12వ మ్యాచ్ లోపే ప్రత్యామ్నాయ ప్లేయర్ ను తీసుకోవటానికి వీలుంటుంది. అయితే, ఈ సారి బీసీసీఐ ఆ నిబంధనల్లో మార్పులు చేసింది. ఈ సీజన్ వరకు 12 మ్యాచ్ ల తరువాత కూడా కొత్త ఆటగాళ్లను ఎంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో తమ దేశాలకు వెళ్లిపోయిన విదేశీ ఆటగాళ్లు లీగ్ కోసం తిరిగొచ్చే అవకాశం లేకపోవటంతో తాత్కాలిక ఒప్పందాలకు బీసీసీఐ అకాశమిచ్చింది.

 

అర్థంతరంగా ఐపీఎల్ నిలిచిపోవటంతో చాలామంది విదేశీ ఆటగాళ్లు తమ దేశాలకు వెళ్లిపోయారు. వాళ్లలో చాలా మంది తిరిగొచ్చే అవకాశం లేకపోవటంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ నిర్ణయంతో ఐపీఎల్ లోని చాలా జట్లకు భారీ ఉపశమనం లభించినట్లయింది.