పాక్తో జరగాల్సిన క్రీడలు మొత్తానికి ఆపేయాలని టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీ చేసిన వ్యాఖ్యలను మీడియా మరో రకంగా చిత్రీకరిస్తుందట. దాంతో పాటు సచిన్కు తనకు ఉన్న స్నేహాన్ని చెడగొట్టేలా వార్తలు రాస్తుందని గంగూలీ మండిపడ్డారు. పుల్వామా ఉగ్రదాడిలో 40మంది జవాన్లు అమరులైన ఘటనకు నిదర్శనంగా పాక్తో క్రీడా సంబంధాలు పూర్తిగా తెంచుకోవాలని గంగూలీ సూచించాడు. దాంతో పాటుగా సచిన్ పాక్తో ఆడి చిత్తుగా ఓడించాలని చేసిన వ్యాఖ్యలపై కూడా స్పందించాడు.
‘సచిన్కు పాక్తో ఆడితే వచ్చే 2పాయింట్లు కోసం చూస్తున్నాడు. నేను పది జట్లలో ఒక జట్టుతో ఆడకపోతే నష్టమేమీ లేదని వరల్డ్ కప్ కచ్చితంగా గెలవాలని’ పిలుపునిచ్చాడు. దానికి మీడియాలో సచిన్కు గంగూలీ విరుద్ధమంటూ రూమర్లు వస్తున్నాయంట. వీటిపై స్పందించిన గంగూలీ ఆదివారం మీడియా సమావేశంలో పాల్గొని వివరణ ఇచ్చాడు.
‘మా ఇద్దరి మధ్య 25ఏళ్ల స్నేహం ఉంది. దానిని పాడు చేయకండి. అసత్య వార్తలు ప్రచారం చేయకండి, నేను సచిన్కు వ్యతిరేకిని కాదు’ అంటూ వివరించాడు.