IPL 2021: మీసాలతో ధోనీ.. కొత్త లుక్ చూశారా..

IPL 2021: చెన్నై సూపర్ కింగ్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ కొత్త లుక్ వైరల్ అయింది. కూతురు జీవా, భార్య సాక్షితో కలిసి సిమ్లాలో దిగిన ఫొటో నెట్టింట హల్ చల్ చేస్తుంది. ఐపీఎల్ 2021 సీజన్ లో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో సీఎస్కే కొనసాగుతుండగా రద్దు అయింది. అయితే ఈ లీగ్ ను మరోసారి యూఏఈ వేదికగా నిర్వహించాలని బీసీసీఐ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

ఇక ఈ ఫొటో విషయానికొస్తే.. ఈ టీమిండియా మాజీ కెప్టెన్ లుక్ చూసి సిమ్లా ట్రెడిషనల్ లుక్ లో కనిపస్తున్నారంటూ.. కామెంట్లు పెడుతున్నారు. దానికి తగ్గట్లుగానే స్థానికంగా వాడే టోపీ పెట్టుకుని ధోనీ ఉన్నారు. గతంలో ఎప్పుడూ లేని స్టైల్ లో కనిపించిన ధోనీ.. ఫొటోను అభిమానులు కన్నుల పండుగగా భావిస్తున్నారు.

బోర్డ్ ఫర్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) ఐపీఎల్ 2021 సెకండ్ ఫేజ్ గురించి ఆల్రెడీ ప్రకటన చేసేసింది. సెప్టెంబర్ నెల మధ్య నుంచి యూఏఈ వేదికగా జరుగుతుందని చెప్పింది. సీఎస్కే 2020వ సీజన్ లో చూపించిన చెత్త ప్రదర్శన నుంచి బయటకు రావాలని ప్రస్తుత సీజన్ లో పట్టుదలగానే కనిపిస్తుంది.

ట్రెండింగ్ వార్తలు