IPL 2025: లక్నోపై పంజాబ్ ఘన విజయం..

తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 236 పరుగుల భారీ స్కోర్ చేసింది.

Courtesy BCCI

IPL 2025: లక్నో సూపర్ జెయింట్స్ తో మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ దుమ్మురేపింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో అదరగొట్టింది. లక్నోపై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 236 పరుగుల భారీ స్కోర్ చేసింది. 237 రన్స్ టార్గెట్ తో బరిలోకి దిగిన లక్నో.. 199 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఫలితంగా 37 రన్స్ తేడాతో పంజాబ్ గెలుపొందింది. ఆయుష్ బదోనీ, సమద్ పోరాడినా ప్రయోజనం లేకపోయింది. బదోనీ 40 బంతుల్లో 74 పరుగులతో చెలరేగి ఆడాడు. అబ్దుల్ సమద్ 24 బంతుల్లో 45 పరుగులతో ధనాధన్ బ్యాటింగ్ చేశాడు. కానీ ఓటమిని తప్పించలేకపోయాడు. పంజాబ్ బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్ 3 వికెట్లు తీశాడు. ఒమర్ జాయ్ 2 వికెట్లు పడగొట్టాడు.

Also Read: సీఎస్‌కేతో మ్యాచ్‌లో చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. క్రిస్ గేల్ రికార్డు బద్దలు.. రోహిత్ శర్మ ఏ స్థానంలో ఉన్నాడంటే?

స్కోర్లు..
పంజాబ్ కింగ్స్ – 20 ఓవర్లలో 236/5
లక్నో – 20 ఓవర్లలో 199/7