IND vs BAN : బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్.. భారత్కు ఒక గుడ్న్యూస్.. మరో బ్యాడ్ న్యూస్..!
సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్తో సిరీస్ ఆరంభం కానుంది.
![IND vs BAN : బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్.. భారత్కు ఒక గుడ్న్యూస్.. మరో బ్యాడ్ న్యూస్..! IND vs BAN : బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్.. భారత్కు ఒక గుడ్న్యూస్.. మరో బ్యాడ్ న్యూస్..!](https://10tv.in/wp-content/uploads/2024/08/Jasprit-Bumrah-to-be-rested-for-Indias-home-Test-series-against-Bangladesh.jpg)
Jasprit Bumrah to be rested for India's home Test series against BangladeshJasprit Bumrah to be rested for India's home Test series against Bangladesh
India vs Bangladesh : శ్రీలంక పర్యటనలో భారత్కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. టీ20 సిరీస్ను 3-0తో క్లీన్స్వీప్ చేసిన భారత్ వన్డే సిరీస్ను 2-0 తేడాతో కోల్పోయింది. ఇక బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్కు ముందు భారత జట్టు ఆటగాళ్లకు దాదాపు నలభై రోజుల విరామం దొరికింది. సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్తో సిరీస్ ఆరంభం కానుంది. రెండు టెస్టులు, మూడు టీ20 మ్యాచులు ఆడనుంది. కాగా.. బంగ్లాదేశ్తో సిరీస్కు టీమ్ఇండియా స్టార్ ఆటగాడు జస్ప్రీత్ బుమ్రా దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) 2025 ఫైనల్కు చేరుకునేందుకు ప్రతి టెస్టు మ్యాచ్ కూడా భారత్కు కీలకం. ఈ క్రమంలో బంగ్లాదేశ్తో రెండు టెస్టు మ్యాచ్లను కూడా తేలికగా తీసుకోవడానికి వీలులేదు. అయితే.. అక్టోబర్లో న్యూజిలాండ్తో మూడు టెస్టులు, నవంబర్లో ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ 5 టెస్టు మ్యాచులు ఆడనుంది. దీంతో బుమ్రా పై వర్క్లోడ్ పడకుండా ఉండేందుకు బంగ్లాతో టెస్టు సిరీస్కు అతడికి విశ్రాంతి ఇవ్వాలని సెలక్టర్లు భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
బుమ్రా చివరిసారిగా టీ20 ప్రపంచకప్ 2024 ఆడాడు. ఆ తరవాత జింబాబ్వే, శ్రీలంక పర్యటనలకు అతడిని ఎంపిక చేయలేదు. అతడికి విశ్రాంతి ఇస్తూ వస్తున్నారు. బుమ్రా బౌలింగ్ శైలి విభిన్నంగా ఉంటుందనే సంగతి తెలిసిందే. దీంతో అతడిని ఎక్కువగా మ్యాచులు ఆడిస్తే గాయాల బారిన పడే అవకాశం ఉంటుందని, అతడి జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మేనేజ్మెంట్దేనని పలువురు మాజీ ఆటగాళ్లు సూచించిన క్రమంలో బీసీసీఐ బుమ్రా విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటోంది. చిన్న జట్లతో ఆడే సిరీస్లకు అతడిని ఎంపిక చేయడం లేదు. బుమ్రా ఇప్పటి వరకు 36 టెస్టు మ్యాచులు ఆడాడు. 20.69 సగటుతో 159 వికెట్లు తీశాడు.
షమీ రీ ఎంట్రీ..!
మరోవైపు బంగ్లాదేశ్తో రెండు టెస్టు మ్యాచుల సిరీస్తో సీనియర్ పేసర్ మహ్మద్ షమీ రీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వన్డే ప్రపంచకప్ 2023 అనంతరం గాయంతో జట్టుకు దూరం అయ్యాడు. శస్త్రచికిత్స అనంతరం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో పునరావాసంలో ఉన్నాడు. ఇటీవలే ప్రాక్టీస్ ఆరంభించిన షమీ ప్రస్తుతం ఫిట్నెస్ సాధించే పనిలో బిజీగా ఉన్నాడు.
ఇక బంగ్లాదేశ్తో సిరీస్కు ముందు దులీఫ్ ట్రోఫీలో ఆడతానని ఇప్పటికే షమీ చెప్పాడు.