థ్యాంక్స్ తాతా అని చెబుతూ.. 103 ఏళ్ల ఫ్యాన్‌కి ధోనీ ఏ బహుమతి ఇచ్చాడో చూడండి

Viral Video: దీంతో రాందాస్ దాన్ని తీసుకుని మురిసిపోయారు. తనకు క్రికెట్ ఆడాలంటే చిన్నప్పటి నుంచే..

థ్యాంక్స్ తాతా అని చెబుతూ.. 103 ఏళ్ల ఫ్యాన్‌కి ధోనీ ఏ బహుమతి ఇచ్చాడో చూడండి

Chennai Super Kings @ChennaiIPL

MS Dhoni CSK Fan: ఐపీఎల్ మ్యాచులు ఆడేందుకు సీఎస్కే ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనీ దేశంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా ఫ్యాన్స్ అతడికి నీరాజనం పడతారు. ధోనీ అంటే చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అందరికీ ఇష్టమే. ప్రతి ఐపీఎల్ సీజన్‌లో తమ అభిమాన క్రికెటర్ ని చూడడానికి చాలా మంది ఫ్యాన్స్ స్టేడియానికి వస్తుంటారు.

చెన్నైకి చెందిన ఎస్.రాందాస్ వయసు 103 సంవత్సరాలు. చాలా కాలంగా ఐపీఎల్ మ్యాచులూ చూస్తూ ఆ దేశవాలీ టోర్నీకి అభిమానిగా మారిపోయారు. తాజాగా ధోనీని ఆ వృద్ధుడు కలిశాడు. రాందాస్ కు ధోనీ మర్చిపోలని బహుమతి ఇచ్చాడు. జెర్సీతో పాటు దానిపై ఆటోగ్రాఫ్ చేసి ఆ వృద్ధుడికి ఇచ్చాడు ధోనీ.

దీంతో రాందాస్ దాన్ని తీసుకుని మురిసిపోయారు. తనకు క్రికెట్ ఆడాలంటే చిన్నప్పటి నుంచే భయం అని రాందాస్ ఈ సందర్భంగా చెప్పారు. అయినప్పటికీ తన అభిమాన జట్టు సీఎస్కే ఆటను టెలివిజన్‌లో చూస్తూనే ఉంటానని వెల్లడించాడు.

అప్పట్లో రాందాస్ బ్రిటిష్ మిలిటరీ అధికారి బృందంలో ఆర్మీలో పనిచేశారు. ధోనీని రాందాస్ కలిసినప్పుడు తీసిన వీడియోను సీఎస్కే జట్టు తమ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. ధోనీ పట్ల వృద్ధులకూ ఇంత అభిమానం ఉంటుందా? అంటూ క్రికెట్ ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.

Also Read : అరుదైన ఘ‌న‌త సాధించిన తెలుగు కుర్రాడు నితీశ్‌రెడ్డి.. ఎలైట్ జాబితాలో వార్న‌ర్ స‌ర‌స‌న‌..