ఇండోనేషియా మాస్టర్ టైటిల్కు అడుగుదూరంలో సైనా నెహ్వాల్

ఇండోనేసియా మాస్టర్స్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత ఏస్ షట్లర్ సైనా నెహ్వాల్ టైటిల్కు అడుగుదూరంలో నిలిచింది. జకార్తా వేదికగా జరుగుతున్న ఈ పోటీల్లో సెమీ ఫైనల్లో ప్రత్యర్థిని చిత్తు చేసిన సైనా ఘన విజయాన్ని నమోదు చేసింది. మహిళల సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్లో ఆరోసీడ్ హే బిన్గ్జియావో (చైనా)తో తలపడింది.
హోరాహోరీగా సాగిన ఈ పోరులో తొలి సెట్ను బిన్గ్జియావో 18-21 తేడాతో కైవసం చేసుకుంది. ఆ తర్వాతి వరుస సెట్లలో జోరు కొనసాగించిన సైనా.. రెండు, మూడో సెట్లను 21-12, 21-18 తేడాతో మ్యాచ్ను గెలిచి ఫైనల్స్కు దూసుకెళ్లింది.
ఫైనల్ పోరులో స్పెయిన్ షట్లర్ కరోలినా మారిన్, చైనా షట్లర్ చెన్ యూఫేలలో ఒకరితో తలపడనుంది. సైనా 2018 కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణాన్ని, ఆసియా గేమ్స్ కాంస్యాన్ని సాధించింది. గతేడాది జరిగిన ఇండోనేషియా మాస్టర్స్, సయ్యద్ మోడీ అంతర్జాతీయ టోర్నీలలో ఫైనల్ వరకూ చేరుకుంది.