IND vs ENG : చ‌రిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ఇంగ్లాండ్ పై స‌చిన్, సెహ్వాగ్‌, గంగూలీ, ధోని, రోహిత్.. ఇలా ఎవ్వ‌రికి సాధ్యం కానీ రికార్డ్‌..

అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఇంగ్లాండ్ పై అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాడిగా విరాట్ కోహ్లీ ఘ‌న‌త అందుకున్నాడు.

ప‌రుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ చ‌రిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంగ్లాండ్ పై 4000 ప‌రుగులు పూర్తి చేసుకున్న తొలి భార‌త బ్యాట‌ర్‌గా రికార్డుల‌కు ఎక్కాడు. ఇంగ్లాండ్‌తో మూడో వ‌న్డే మ్యాచ్‌లో ఈ రికార్డును అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 21 ప‌రుగుల వ్య‌క్తిగ‌త స్కోరు వ‌ద్ద కోహ్లీ ఈ రికార్డును సాధించాడు. ఇక ఓవ‌రాల్‌గా ఈ ఘ‌న‌త సాధించిన ఆరో బ్యాట‌ర్‌గా నిలిచాడు.

తాజా మ్యాచ్‌తో క‌లిపి ఇప్ప‌టి వ‌ర‌కు కోహ్లీ ఇంగ్లాండ్ పై (వ‌న్డేలు, టీ20లు, టెస్టులు) 87 మ్యాచ్‌లు ఆడాడు. 4 వేల ప‌రుగులు పూర్తి చేసుకున్నాడు. 8 సెంచ‌రీలు, 23 అర్థ‌శ‌త‌కాలు సాధించాడు.

IND vs ENG : మూడు మార్పుల‌తో బ‌రిలోకి దిగిన టీమ్ఇండియా.. నిరాశ‌ప‌రిచిన రోహిత్ శ‌ర్మ..

ఓవ‌రాల్‌గా ఆస్ట్రేలియా దిగ్గ‌జ ఆట‌గాడు డాన్ బ్రాడ్‌మ‌న్ 5028 ప‌రుగుల‌తో ఇంగ్లాండ్ పై అత్య‌ధిక ప‌రుగులు చేసిన ఆట‌గాళ్ల జాబితాలో అగ్ర‌స్థానంలో ఉన్నాడు. ఆ త‌రువాత వ‌రుస‌గా అలెన్ బోర్డ‌ర్, స్టీవ్ స్మిత్ , రిచ‌ర్డ్స్ ఉన్నారు.

అంత‌ర్జాతీయ క్రికెట్‌లో ఇంగ్లాండ్ పై అత్య‌ధిక ప‌రుగులు చేసిన ప్లేయ‌ర్లు..

డాన్ బ్రాడ్‌మ‌న్ (ఆస్ట్రేలియా) – 63 ఇన్నింగ్స్‌ల్లో 5,028 ప‌రుగులు
అలెన్ బోర్డ‌ర్ (ఆస్ట్రేలియా) – 124 ఇన్నింగ్స్‌ల్లో 4,850 ప‌రుగులు
స్టీవ్ స్మిత్ (ఆస్ట్రేలియా) – 114 ఇన్నింగ్స్‌ల్లో 4,815 ప‌రుగులు
వివియన్ రిచర్డ్స్ (వెస్టిండీస్‌) – 84 ఇన్నింగ్స్‌ల్లో 4,488 ప‌రుగులు
రికీ పాంటింగ్ (ఆస్ట్రేలియా) – 99 ఇన్నింగ్స్‌ల్లో 4,141 ప‌రుగులు
విరాట్ కోహ్లీ (భార‌త్‌) – 109 ఇన్నింగ్స్‌ల్లో 4, 001 ప‌రుగులు

Champions trophy 2025 : పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు భార‌త్‌కు ఐసీసీ గుడ్‌న్యూస్‌.. విజ‌యం మ‌న‌దేరా..

ఇక ఈ మ్యాచ్‌లో కోహ్లీ 50 బంతుల్లో హాఫ్ సెంచ‌రీ సాధించాడు. వ‌న్డేల్లో కోహ్లీకి ఇది 73వ హాఫ్ సెంచ‌రీ. మొత్తంగా ఈ మ్యాచ్‌లో కోహ్లీ 55 బంతులు ఆడి 7 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 52 ప‌రుగులు చేశాడు. ఆదిల్ ర‌షీద్ బౌలింగ్‌లో ఫిలిప్ సాల్ట్ క్యాచ్ అందుకోవ‌డంతో కోహ్లీ ఔట్ అయ్యాడు. వ‌న్డేల్లో కోహ్లీని ఆదిల్ ర‌షీద్ ఔట్ చేయ‌డం ఇది 5వ సారి.