PAN Card 2.0 Fraud
PAN Card 2.0 Fraud : యూపీఐ వినియోగదారులకు బిగ్ అలర్ట్.. ప్రస్తుత రోజుల్లో డిజిటల్ పేమెంట్ల కోసం UPI వాడకం భారీగా పెరిగింది. సైబర్ నేరస్థులు ఇదే క్యాష్ చేసుకునేందుకు కొత్త మార్గాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. వినియోగదారులను నమ్మించి మోసం చేసేందుకు ప్రయత్నిస్తుంటారు.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఈ సైబర్ మోసాలపై యూపీఐ యూజర్లను అప్రమత్తం చేస్తోంది. బ్యాంక్ అకౌంట్లలో డబ్బును కాజేసే కొత్త స్కామ్ గురించి హెచ్చరికను జారీ చేసింది. ఈ కొత్త స్కామ్ బారిన పడకుండా యూపీఐ వినియోగదారులు ఎలా రక్షించుకోవచ్చో తెలియజేస్తోంది.
పాన్ కార్డ్ 2.0 స్కామ్ ఏంటి? :
NPCI అధికారిక (X) ద్వారా “పాన్ కార్డ్ 2.0 అప్గ్రేడ్” పేరుతో మోసాలు జరుగుతున్నాయని హెచ్చరిస్తోంది. బ్యాంకింగ్, వ్యక్తిగత వివరాలను షేర్ చేయమనే కొత్త స్కామ్ గురించి వినియోగదారులను అప్రమత్తం చేస్తోంది. మోసగాళ్ళు ఇలా పేర్కొంటూ ఫేక్ మెసేజ్లను పంపుతారు.
మీ పాన్ కార్డ్ బ్లాక్ అయింది. పాన్ కార్డ్ 2.0కి అప్గ్రేడ్ చేసుకోండి. మీ ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతా వివరాలను చెప్పండి. చాలా మంది ఈ మోసాల బారిన పడుతున్నారు. తెలియకుండానే వారి వ్యక్తిగత సమాచారాన్ని సైబర్ నేరగాళ్లకు అందిస్తారు. ప్రతి అప్గ్రేడ్ నిజమైనది కాదని గుర్తించాలి. ఈ స్కామ్ మీ మొత్తం బ్యాంక్ బ్యాలెన్స్ను ఖాళీ చేస్తుందని NPCI హెచ్చరించింది.
UPI మోసాల నుంచి సేఫ్గా ఎలా ఉండాలి?
NPCI అవగాహన ప్రచారం :
ఇలాంటి మోసాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు NPCI (#MainMoorkhNahiHoon) అనే ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ చొరవతో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని, ఇతరులకు అవగాహన కల్పించాలని, మోసగాళ్ల మాయలకు గురికాకుండా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తోంది. ఈ హెచ్చరికను స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయాలని NPCI కోరుతోంది. తద్వారా వారు కూడా మోసాల పట్ల జాగ్రత్తగా ఉండేందుకు అవకాశం ఉంటుంది.
తప్పక గుర్తుంచుకోండి : ఏ బ్యాంకు, ప్రభుత్వ సంస్థ లేదా ఆర్థిక సంస్థ కూడా మీ వ్యక్తిగత వివరాలను మెసేజ్ లేదా ఫోన్ కాల్ ద్వారా ఎప్పుడూ అడగవు.