ప్రస్తుత కాలంలో పిల్లలు విపరీతంగా మొబైల్ వాడుతున్నారు. చిన్నారులు ఏడిస్తే పెద్దలు వారికి మొబైల్ ఇచ్చి బుజ్జగిస్తున్నారు. పెద్దలు పనులు చేసుకుంటున్నప్పుడు చిన్నారులు గొడవ చేయకుండా బుద్ధిగా ఒకేచోట కూర్చోవడానికి కూడా వారికి మొబైల్ను అలవాటు చేస్తున్నారు. చిన్నారులు మొబైల్ ఫోన్లకు బానిసలుగా మారుతుండడంతో అనేక రకాల ఆరోగ్య సమస్యలు వారికి చుట్టుముడుతున్నాయి.
Also Read: పాపం పసివాళ్లు… అప్పుడు అమ్మ.. ఇప్పుడు నాన్న.. ఏడాదిలోనే ఇద్దర్నీ కోల్పోయి..
దీంతో పోలీసులు కూడా దీనిపై అవగాహన కల్పించే కార్యక్రమాలు పెట్టుకున్నారు. తాజాగా తెలంగాణలోని రాచకొండ పోలీసులు పిల్లల తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు. పిల్లల స్క్రీన్ సమయాన్ని తగ్గించడానికి కొన్ని ఉపయోగకరమైన చిట్కాలు అందించారు. పిల్లల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ చిట్కాలను పాటిస్తే ఎంతో మేలని చెప్పారు.
పిల్లల స్క్రీన్ టైమ్ తగ్గించేందుకు పోలీసులు చేసిన కొన్ని సూచనలు
#TodaysThemePoster
పిల్లల స్క్రీన్ సమయాన్ని తగ్గించడానికి కొన్ని ఉపయోగకరమైన చిట్కాలు.
బహిరంగ ఆటలను ప్రోత్సహించండి మరియు మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి.#TelanganaPolice #RachakondaPolice #TGPolice pic.twitter.com/6eNl17L73R— Rachakonda Police (@RachakondaCop) February 12, 2025