తల్వార్లతో కుటుంబంపై దాడి.. ఇద్దరి మృతి.. మరో ఇద్దరి పరిస్థితి విషమం

నలుగురు కుటుంబ సభ్యులపై విచక్షణారహితంగా దాడి చేయడంతో అక్కడికక్కడే..

తల్వార్లతో కుటుంబంపై దాడి.. ఇద్దరి మృతి.. మరో ఇద్దరి పరిస్థితి విషమం

Crime

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కొందరు దుండగులు తల్వార్లతో రెచ్చిపోయారు. 16 చింతల తండాలో బానోతు శ్రీనివాస్, బానోతు సుగుణ దంపతులు, వారి కుటుంబ సభ్యులపై తల్వార్లతో దాడి చేశారు.

నలుగురు కుటుంబ సభ్యులపై విచక్షణారహితంగా దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందింది సుగుణ. తీవ్ర గాయాలతో నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో బానోతు శ్రీనివాస్ మృతి చెందాడు. అతడి కుమారుడు మదన్, కూతురు దీపికకు తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమించడంతో ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.

దాడి ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దారుణానికి కారణం అదే గ్రామానికి చెందిన మేకల బన్నీ అని బాధితుల బంధువులు ఆరోపిస్తున్నారు. ఈ హత్యలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: ‘తల్లికి వందనం’ కోసం విధివిధానాలు ఖరారు.. ఆధార్ కార్డుతో..