KTR : హన్మకొండలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. నిరాధార ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా కేటీఆర్ వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు.
హన్మకొండ పోలీస్ స్టేషన్లో జీరో ఎఫ్ఐఆర్ నమోదైనట్టు తెలుస్తోంది. ఐపీసీ సెక్షన్లు 504, 505 కింద కేటీఆర్పై కేసు నమోదు అయినట్టు సంబంధిత వర్గాల సమాచారం.
Read Also : Nellore Rural Politics : ఒకవైపు అదృష్టవంతుడు, మరోవైపు పోరాట యోధుడు.. నెల్లూరు రూరల్లో గెలుపెవరిది?