Rahul Gandhi : ఆగస్టు 21న తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభకు మించి బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఎదురు దాడే లక్ష్యంగా సిరిసిల్ల సభకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
- bheemraj
- Updated on- July 9, 2022 / 05:01 PM IST
Rahul Gandhi
Rahul Gandhi : కాంగ్రెస్ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ ఆగస్టు 21న తెలంగాణలో పర్యటించనున్నారు. రాహుల్ గాంధీ పర్యటనపై టీపీసీసీకి ఏఐసీసీ సమాచారం ఇచ్చింది. నిరుద్యోగ సమస్యలపై నిరుద్యోగ డిక్లరేషన్ చేసేందుకు టీపీసీసీ కసరత్తు చేస్తోంది. ఆగస్టు 21న సిరిసిల్లలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి.. రాహుల్ గాంధీ ద్వారా నిరుద్యోగ డిక్లరేషన్ ప్రకటించాలని టీ కాంగ్రెస్ భావిస్తోంది.
Revanth Reddy : రాహుల్ సమక్షంలో కాంగ్రెస్లో చేరిన టీఆర్ఎస్ మేయర్,నేతలు
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో బీజేపీ నిర్వహించిన విజయ సంకల్ప సభకు మించి బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఎదురు దాడే లక్ష్యంగా సిరిసిల్ల సభకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
