Indian Air Force : ట్రెడిషన్, ఇన్నోవేషన్ రెండింటినీ కలుపుకునిపోతూ భాధ్యతలను నిర్వర్తించాలి.. యువ పైలెట్లకు కేంద్ర మంత్రి సూచన

దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు.

Dundigal Air Force Academy

Minister Rajnath Singh : దుండిగల్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ ను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. కేంద్ర మంత్రి యువ పైలెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణ పొందిన 213 మంది యువ పైలెట్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం పిలాటస్ పీసీ-7 ట్రైనింగ్ ఎయిర్ క్రాఫ్ట్, సుఖోయ్ -30, సారంగ్ హెలిక్యాప్టర్లతో విన్యాసాలు ప్రదర్శించారు. యువ పైలెట్ల విన్యాసాలు చూపరులను కట్టిపడేశాయి.

Also Read : CM Revanth Reddy: రఘురాం రాజ‌న్‌తో సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ.. ఏఏ విషయాలపై చర్చించారంటే

ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడుతూ.. శిక్షణ పూర్తి చేసుకున్న క్యాడెట్లకు శుభాకాంక్షలు తెలిపారు. శిక్షణ పూర్తిచేసుకున్న క్యాడెట్లు ఆఫీస్లుగా రావడం సంతోషంగా ఉందని అన్నారు. మీపైన మరింత బాధ్యత పెరుగుతుందని సూచించారు. శిక్షణ సమయంలో మీరు మీ కుటుంబానికి, బంధువులకు, స్నేహితులకు, పండుగలకు దూరంగా ఉండి శిక్షణను పూర్తి చేశారు.. శిక్షణ పూర్తి చేసుకున్నవారు మరిన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని రాజ్ నాథ్ సింగ్ అన్నారు. దేశ గౌరవం, దేశ భద్రత మీపైనా ఉంటుందని అన్నారు. సరికొత్త ఇన్నోవేషన్ లు వస్తున్నాయి.. టెక్నాలజీ సాంకేతికంగా అనుగుణంగా అప్డేట్ అవ్వాలని క్యాడెట్లకు రాజ్ నాథ్ సింగ్ సూచించారు. ట్రెడిషన్, ఇన్నోవేషన్ రెండింటినీ కలుపుకునిపోతూ భాధ్యతను నిర్వర్తించాలని, మన దేశ సంప్రదాయాలను పాటిస్తూ గౌరవించాలని కాడెట్లకు కేంద్ర మంత్రి సూచించారు.

 

 

 

 

 

ట్రెండింగ్ వార్తలు