Earthquake : వికారాబాద్ జిల్లాలో మరోసారి భూకంపం
వికారాబాద్ జిల్లాలో భూమి కంపించింది. బంట్వారం మండలం తొర్మామిడి, బొపునారం కర్ణాటక సరిహద్దు గ్రామమైన పోచారంలో భూమి కంపించింది.
- kunduru Vinod
- Published On : September 12, 2021 / 10:33 AM IST
Earthquake
Earthquake : వికారాబాద్ జిల్లాలో భూమి కంపించింది. బంట్వారం మండలం తొర్మామిడి, బొపునారం కర్ణాటక సరిహద్దు గ్రామమైన పోచారంలో భూమి కంపించింది.
Read More : Accident : మేడ్చల్ లో ఘోర రోడ్డు ప్రమాదం..మూడేళ్ల బాలుడు సహా ముగ్గురు మృతి
పెద్దగా శబ్దాలు రావడంతో ప్రజలు ఇళ్లలోంచి పరుగులు తీశారు. ఆరు సెకన్లపాటు భూమి కంపించడంతో ప్రజలు భయపడిపోయారు. ఇదిలా ఉంటే ఆగస్టు నెలలో తొర్మామిడికి 35కిలోమీటర్ల దూరంలో ఉన్న గుల్భర్గా జిల్లా చించోలి తాలుకాలోని కర్కిచెడ్ గ్రామంలో భూమి కంపించింది.
Read More : Iraq : విమానాశ్రయం సమీపంలో డ్రోన్ దాడి
అయితే ఆ ఘటన మరవకముందే మళ్లీ భూమి కంపించడంతో ప్రజలు ఆందోళన చెందారు.
