హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాక్… పెరిగిన ఛార్జీలు.. టికెట్ రేట్లు ఎలా ఉన్నాయంటే?
గరిష్ఠ ఛార్జీ రూ.60 నుంచి రూ.75కు పెంపు

HYD Metro
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు షాక్. ముందుగా ఊహించినట్లుగానే మెట్రో ఛార్జీలను పెంచారు. మే 17 తేదీ నుంచే.. పెంచిన మెట్రో రైల్ ఛార్జీలు అమల్లోకి వస్తాయి. మెట్రో రైల్వేస్ చట్టం 2002 సెక్షన్ 34 ప్రకారం ఛార్జీలను సవరించారు.
హైదరాబాద్ మెట్రో సర్వీసులు అందరికీ అందుబాటులో ఉండేలా కొనసాగించడానికి, నాణ్యమైన సేవలు అందించేందుకు ఛార్జీల సవరణ ఉపయోగపడుతుందని మెట్రో రైల్ అధికారులు తెలిపారు. ప్రయాణికులు సహకరించాలని ఎల్ అండ్ టీ సంస్థ విజ్ఞప్తి చేసింది.
పెరిగిన ఛార్జీలు ఇలా..
కనీస ఛార్జీ రూ.10 నుంచి రూ.12కు పెంపు
గరిష్ఠ ఛార్జీ రూ.60 నుంచి రూ.75కు పెంపు
ఎన్ని కిలోమీటర్లకు ఎంత చార్జ్?
- రెండు కిలోమీటర్ల వరకు 12 రూపాయలు
- నాలుగు కిలోమీటర్ల వరకు 18 రూపాయలు
- 6 కిలోమీటర్ల వరకు 30 రూపాయలు
- 9 రూపాయల వరకు 40 రూపాయలు
- 12 కిలోమీటర్ల వరకు 50 రూపాయలు
- 15 కిలోమీటర్ల వరకు 55 రూపాయలు
- 18 కిలోమీటర్ల వరకు 60 రూపాయలు
- 21 కిలోమీటర్ల వరకు 66 రూపాయలు
- 24 కిలోమీటర్ల వరకు 70 రూపాయలు
- 24 కిలోమీటర్ల తర్వాత ప్రయాణం చేసే వారికి 75 రూపాయలు