Jubilee Hills GangRape Case : జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. అసలేం జరిగిందో చెప్పిన అమ్నేసియా పబ్ మేనేజర్

Jubilee Hills GangRape Case : సంచలనం రేపిన జూబ్లీహిల్స్ రేప్ కేసులో పోలీసుల దర్యాఫ్తు ముమ్మరంగా కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ నడిరోడ్డుపై కదులుతున్న కారులో మైనర్ అమ్మాయిపై గ్యాంగ్ రేప్ చేశారనే వార్త యావత్ నగరాన్ని ఉలిక్కి పడేలా చేసింది. కాగా, జూబ్లీహిల్స్ లోని అమ్నేసియా పబ్ లో పార్టీ చేసుకున్న తర్వాతే ఈ దారుణం వెలుగుచూసింది. దీంతో పబ్ చుట్టూ వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో దీనికి సంబంధించి అమ్నేసియా పబ్ మేనేజర్ సాయి కిరణ్ 10టీవీతో మాట్లాడారు. అసలు పబ్ లో ఏం జరిగింది? అనేది దానిపై ఆయన కీలక విషయాలు చెప్పారు.

”ఈ నెల 28వ తేదీన 150 మంది మైనర్లు వితౌట్ ఆల్కహాల్ పార్టీ చేసుకున్నారు. మా పబ్ లో మైనర్ అమ్మాయిపై అలాగే పార్టీకి వచ్చిన అమ్మాయిలతో ఎవరు కూడా మిస్ బిహేవ్ చేయలేదు. మొత్తం సీసీ కెమెరాలు ఉన్నాయి. ఈ ఘటన బయట జరిగింది. పబ్ కు సంబంధించిన సీసీ ఫుటేజ్ పోలీసులకు అప్పగించాము. పోలీసులు ఎంట్రీ, ఎగ్జిట్ సీసీ ఫుటేజ్ పరిశీలించారు. మైనర్లకు ఫుడ్, స్నాక్స్ సర్వ్ చేసేందుకు మాకు పర్మిషన్ ఉంది. ప్రభుత్వం సూచించిన నిబంధనలన్నీ పాటించాము. మైనర్లకు ఆ రోజు మద్యం సర్వ్ చేయలేదు. అలాగే సిగరెట్లు కూడా లోనికి అనుమతి ఇవ్వలేదు. వారికి మేము ఆల్కహాల్ టెస్ట్ చేసి లోనికి అనుమతించాము. ఆ రోజు ఫ్రేషర్స్ డే పార్టీ కోసం గాంధీ అనే వ్యక్తి మా పబ్ ను సంప్రదించి బుక్ చేసుకున్నారు” అని పబ్ మేనేజర్ సాయి కిరణ్ తెలిపారు.(Jubilee Hills GangRape Case)

Rape On Girl : జూబ్లీహిల్స్ అమ్నేసియా పబ్‌ కేసు..రోడ్లపై తిప్పుతూ కారులోనే బాలికపై ఐదుగురు అత్యాచారం

ఐదుగురు అబ్బాయిలు. ఒక అమ్మాయి. వాళ్లంతా స్నేహితులు. సరదాగా బయటకు వెళ్లారు. జూబ్లీహిల్స్ లోని అమ్నేసియా పబ్ లో పార్టీ చేసుకున్నారు. ఆ తర్వాత పబ్ ముందు కాసేపు నిలబడి ముచ్చట్లు పెట్టారు. అక్కడి నుంచి అందరూ కలిసి బెంజ్ కారులో బయటకు వెళ్లారు. రెండు గంటల తర్వాత అదే పబ్ ముందు మరో కారు వచ్చి ఆగింది.

Minors Gang Rape Girl : దారుణం.. 11ఏళ్ల బాలికపై ఆరుగురు మైనర్లు గ్యాంగ్ రేప్

కారులోంచి బయటకు దిగిన అమ్మాయి హడావుడిగా ఇంటికి వెళ్లిపోయింది. తనపై ఐదుగురు గ్యాంగ్ రేప్ చేశారంటూ తండ్రికి చెప్పింది. షాక్ తిన్న తండ్రి.. జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించారు. కారులో తన కూతురిని తీసుకెళ్లి లైంగిక దాడి చేశారంటూ ఫిర్యాదు చేశారు. దీంతో యావత్ నగరం ఉలిక్కిపడింది. జూబ్లీహిల్స్ నడిరోడ్డుపై కదులుతున్న కారులో యువతిని రేప్ చేశారన్న వార్త ఆడపిల్లలున్న కుటుంబాలను కలవరానికి గురి చేసింది. పైగా నిందితుల్లో పొలిటికల్ లీడర్ల పుత్రరత్నాలు ఉన్నారనే అనుమానాలు ఈ కేసుకి మరింత హైప్ తీసుకొచ్చాయి. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు నిందితుల కోసం ఉరుకులు పరుగులు పెడుతున్నారు. స్పెషల్ టీమ్స్ తో వారి కోసం గాలిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు