Santhoshi Matha: హైదరాబాద్ నగరంలోని ఎల్బీ నగర్ పరిధిలో హస్తినాపురం సంతోషిమాత కాలనీలో సంతోషిమాత ఆలయంలోభారీ చోరీ చోటుచేసుకుంది. గర్భగుడిలో గుర్తు తెలియని దుండగులు ప్రవేశించి తాళాలు బద్దలుకొట్టారు.
సుమారుగా 35 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. తెల్లవారుజామున ఆలయానికి వచ్చిన అర్చకులు హుండీ తాళాలు బద్దలుకొట్టి ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Kangana Ranaut : పంజాబ్ పర్యటనకు వెళ్లిన కంగనా రనౌత్ను అడ్డుకున్న రైతులు