Mlc Kavitha: హైదరాబాద్కు కవిత.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా అభిమానులు, జై కవితక్క అంటూ నినాదాలు..
కవితక్క నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తున్నారు.

Mlc Kavitha: హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఎమ్మెల్సీ కవిత అభిమానులు భారీగా చేరుకున్నారు. అమెరికా నుంచి వస్తున్న కవితకు గ్రాండ్ గా వెల్ కమ్ చెప్పేందుకు వారంతా వచ్చారు. జై కవితక్క అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. సామాజిక తెలంగాణ లక్ష్యంగా పని చేస్తున్న కవితక్కకు స్వాగతం అంటూ బ్యానర్లు ప్రదర్శించారు. కవితక్క నాయకత్వం వర్ధిల్లాలి అంటూ నినాదాలు చేస్తున్నారు.
Also Read: కవిత మరో షర్మిల కాబోతుందా?.. సీఎం రేవంతే ఆ లెటర్ రాయించారేమో.. ఎంపీ రఘునందర్ హాట్ కామెంట్స్
అమెరికా టూర్ నుంచి కవిత హైదరాబాద్ కు వస్తున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు రావాలని జాగృతి కార్యకర్తలకు ఆమె సందేశం పంపారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీ జనసమీకరణకు కవిత ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు కవిత లేఖపై బీజేపీ, కాంగ్రెస్ మాటల యుద్ధానికి దిగాయి. కవిత లేఖ డ్రామా అని బీజేపీ అంటుండగా.. బీఆర్ఎస్ లో లుకలుకలు బయటపడ్డాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఈ అంశంపై బీఆర్ఎస్ నేతలు అధికారికంగా ఇప్పటివరకు స్పందించలేదు.