Telangana : dharani portal : తెలంగాణ రాష్ట్రంలో భూ లావాదేవీలకు ఆధారంగా మారనున్న ధరణి పోర్టల్ ను CM KCR దసరా రోజు ప్రారంభించనున్నారు. విజయదశమి అంటే విజయానికి చిహ్నం. శుభదినం. ప్రజలంతా విజయదశమి పండుగను ఉత్సాహంగా జరుపుకుంటారు. ఈ క్రమంలో దసరా రోజు ‘ధరణి’ పోర్టర్ ను ప్రారంభించనున్నారు. భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభంకానుంది. ‘ధరణి’ పోర్టల్ కు సంబంధించి అన్ని పనులు పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
భూ రికార్డులకు సంబంధించి ధరణి వెబ్సైట్లో ఏ డేటా ఉంటే ఆ వివరాల ఆధారంగానే రిజిస్ట్రేషన్లు చేయాలని, ఇతర రికార్డులను పరిశీలించడానికి వీల్లేదని ప్రభుత్వం స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దసరా నుంచి అంటే..అక్టోబర్ 25,2020 నుంచి ధరణి పోర్టల్ అందుబాటులోకి రానుంది. ‘ధరణి’పోర్టల్ అందుబాటులోకి రానున్న క్రమంలో అన్ని వివరాలు సవ్యంగా ఉంటే రైతుల చేతికి కేవలం అరగంటలోపే పాస్ పుస్తకం చేతికి అందనుంది. ఆయా భూములకు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయి పట్టాదారు పాస్పుస్తకం రైతు చేతికందనుంది.
భూ రికార్డులకు సంబంధించి ధరణి వెబ్సైట్లో ఏ డేటా ఉంటే ఆ వివరాల ఆధారంగానే రిజిస్ట్రేషన్లు చేయాలని, ఇతర రికార్డులను పరిశీలించడానికి వీల్లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దసరా నుంచి అంటే, ఈనెల 25వ తేదీన ధరణి పోర్టల్ అందుబాటులోకి వస్తుంది. ఆ రోజు నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లను హైదరాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా 570 మండలాల్లో జరుగుతుతాయి. అయితే తొలిదశలో రిజిస్ట్రేషన్లకు సంబంధించి నాలుగు డాక్యుమెంట్లను మాత్రమే చేయడానికి తహసీల్దార్లకు అవకాశం ఇచ్చారు.
ఆ మేరకు భూముల విక్రయాలకు సంబంధించిన సేల్ డీడ్, కుటుంబసభ్యులు/ఇతర భూముల యాజమానులు పంచుకునే పార్టిషన్, కటుంబసభ్యులు సమర్పించే సక్సెషన్ (వారసత్వ) డీడ్, గిఫ్ట్ డీడ్లు చేయడానికే తహసీల్దార్లకు అవకాశం ఇస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది.రిజిస్ట్రేషన్ సహా రెవెన్యూ రికార్డుల అప్డేషన్, మ్యుటేషన్ (హక్కు బదలాయింపు) అంతా అప్పుడే అక్కడికక్కడే పూర్తి కానున్నాయి. . ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ హక్కులు, పాస్పుస్తకాల చట్టం–2020తో భూ హక్కుదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీనికి సంబందించి టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా ఇప్పటికే కూలంకషంగా పూర్తికావటంతో విజయదశమి నుంచి రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి.
ఈ రిజిస్ట్రేషన్కు అప్లికేషన్ పూర్తి చేయటం నుంచి స్లాట్ బుకింగ్ వరకుపలు దశల్లో సమాచారాన్ని క్రయ, విక్రయదారులు ఆన్లైన్లోనే నమోదు చేయాల్సి ఉంటుంది. పారదర్శకంగా, సులభతరంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరిగేలా చూడటం..దళారీ వ్యవస్థకు అడ్డుకట్ట వేసేలా రెవెన్యూశాఖ ధరణి పోర్టల్ను రూపొందించింది. కంప్యూటర్ పరిజ్ఞానం ఉంటే చాలు స్లాట్ బుక్ చేసుకొని రిజి్రస్టేషన్ కోసం తహసీల్కు వెళ్లేలా ప్లాట్ఫామ్ను తయారుచేసింది. ఆన్లైన్ పరిజ్ఞానంలేని రైతులు మాత్రం ఈ–సేవ కేంద్రాల్లో చేయించుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ కు పాన్కార్డు నంబర్ను నమోదు చేయాలి. పాన్ కార్డు లేకపోతే ఫారం 60, 61 డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది.
అక్టోబరు 25 నుంచి సాగు భూముల రిజిస్ట్రేషన్లు తహసీళ్లలో..వారసత్వ బదిలీ, క్రయవిక్రయాలు, భాగపంపిణీ, బహుమతి, కోర్టు డిక్రీ ద్వారా వచ్చే హక్కులకు సంబంధించి తహశీల్దారులే చేయనున్నారు. కాగా..సాగు భూములు లేని హైదరాబాద్ జిల్లాను మినహాయించి రాష్ట్రవ్యాప్తంగా 570 మండలాల్లో ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ దసరా రోజున ప్రారంభించేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సన్నద్ధమైంది.ఆయా భూముల్ని అమ్మినవారు..కొన్నవారు కూడా రిజిస్ట్రేషన్ సమయంలో అఫిడవిట్ సమర్పించాలి. దీంట్లో పరస్పర అంగీకారం మేరకే ఈ లావాదేవీలు జరిగినట్లు ఇద్దరు తమ వారి అంగీకారాన్ని తెలియజేయాల్సివుంటుంది.
భూ క్రయ..విక్రయదారులు ఏం చేయాలంటే..
ఈ ప్రక్రియ పూర్తి అయిన తరువాత రెవెన్యూ అధికారులు వర్క్ స్టార్ట్