KTR: పిచ్చోడి చేతిలో పార్టీ ఉంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదం : కేటీఆర్
పిచ్చోడి చేతిలో రాయి ఉంటే అందరికి ప్రమాదం..అదే పిచ్చోడి చేతిలో పార్టీ ఉంటే అది ప్రజాస్వామ్యానికే ప్రమాదం అంటూ బండి సంజయ్ పై సెటైర్లు చేసారు మంత్రి కేటీఆర్.
KTR : తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పై మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. పిచ్చోడి చేతిలో రాయి ఉంటే అందరికి ప్రమాదం.. అదే పిచ్చోడి చేతిలో పార్టీ ఉంటే అది ప్రజాస్వామ్యానికే ప్రమాదం అంటూ సెటైరిక్ విమర్శలు చేసారు మంత్రి కేటీఆర్. పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్ ఘటనలో బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై కేటీఆర్ మాట్లాడుతూ.. స్వార్థ రాజకీయాల కోసం ప్రశ్నాపత్రాలు లీక్ చేసి అమాయకులైన విద్యార్ధుల, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడారు అంటూ బండి సంజయ్ పై కేటీఆర్ విమర్శలు సంధించారు.
Bandi Sanjay Arrest : బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ లో బండి సంజయ్
వికారాబాద్, కమలాపూర్ లలో పదో తరగతి పరీక్షా పత్రాలు బయటకు వచ్చిన వ్యవహారంలో బండి సంజయ్ పై కమలాపూర్లో కేసు నమోదు అయ్యింది. సీఆర్ పీసీ 151, 154, 157 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా.. తెలంగాణలో 10వ తరగతి ప్రశ్నా పత్రాల లీక్ పెను సంచలనం కలిగించింది.
ఈ వ్యవహారంలో బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాత్ర ఉందంటూ పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ప్రశ్నాపత్రాల లీక్ కేసులో బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ పిచ్చోని చేతిలో రాయి ఉంటే ప్రమాదమని..నీచ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన బీజేపీ.. పేపర్ లీకేజీ కుట్రలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి అరెస్ట్.. అంటూ కేటీఆర్ రీట్వీట్ చేశారు.
పిచ్చోని చేతిలో రాయి ఉంటే..
వచ్చి పోయేటోళ్ళకే ప్రమాదం…!!కానీ
అదే పిచ్చోని చేతిలో ఒక పార్టీ ఉంటే
ప్రజాస్వామ్యానికే ప్రమాదం…!!!తమ స్వార్థ రాజకీయాల కోసం
ప్రశ్నా పత్రాలు లీకు చేసి అమాయకులైన విద్యార్ధుల, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న బీజేపి నాయకులు #BJPleaks https://t.co/8GFI6ups6v— KTR (@KTRBRS) April 5, 2023