నూజివీడులో అర్థరాత్రి దారుణం : 10ఏళ్ల చిన్నారిపై అత్యాచారం
అర్ధరాత్రి దారుణం జరిగింది. 10 సంవత్సరాల చిన్నారి జీవితాన్ని ఓ కామాంధుడు నలిపేశాడు.కృష్ణాజిల్లా నూజివీడులోని ట్రిపుల్ ఐటీ సమీపంలో బాలికపై గుర్తు తెలియని వ్యక్తి అత్యాచారానికి తెగబడ్డాడు. కామాంధుడు చేసిన అఘాయిత్యానికి తట్టుకోలేని బాలిక పరిస్థితి విషమంగా తయారైంది.
వివరాల్లోకి వెళితే..నూజివీడులోని శ్రీనివాస థియేటర్ సమీపంలోని సాయిబాబా గుడి వద్ద నివాసముంటున్న దంపతులకు పది సంవత్సరాల వయస్సు గల బాలిక ఉంది. బైటకు వెళ్లిన తమ బిడ్డ అర్థరాత్రి సమయంలో ఇంటి బైటకకు వచ్చి ఇంకా ఇంటికి రాని తండ్రి కోసం ఎదురు చూస్తోంది. రోడ్డుపైకి వచ్చి తండ్రి కోసం ఎదురు చూస్తున్న బాలికను ఓ వ్యక్తి గమనించాడు. బాలికపై కన్నేశాడు.
వెంటనే బాలిక దగ్గరకు వచ్చి రేంజర్ సైకిల్ పై వచ్చి మీ నాన్న సెంటర్లో ఉన్నాడు నిన్ను తీసుకు రమ్మన్నాడు అని చెప్పాడు. ఆ మాయమాటలు నమ్మేసింది బాలిక. అలాబాలికిను సైకిల్ ఎక్కించుకొని స్థానిక గొడుగు వారి గూడెం రోడ్డు నుండి త్రిబుల్ ఐటీ వెనకవైపు కిలోమీటర్ తీసుకువెళ్లి బాలికపై అత్యాచారం చేసి సంఘటనా స్థలంలోనే బాలికను వదిలివేసి పరారయ్యాడు.
ఒంటినిండా గాయాలతో ఏడుస్తున్న చిన్నారి ఏడుపులు రాత్రి సమయంలో పెట్రోలింగ్ నిర్వహిస్తునన పోలీసులు విని అటువైపుగా వచ్చారు.అక్కడ రోడ్డుపై దీనంగా ఏడుస్తూ..తనకేం జరిగిందో కూడా తెలుసుకోలని ఆ చిన్నారి ఏడుస్తూ నిలబడి ఉంది. అర్ధరాత్రి సమయంలో ఓ చిన్నపాప అక్కడ ఉండటం చూసి నూజివీడు సర్కిల్ ఇన్స్పెక్టర్ రామచంద్రరావు చూసి ఏదో జరిగి ఉంటుందని అనుమానించారు. పాప దగ్గరకు వెళ్లి ఏం జరిగిందని అడగ్గా..జరిగిన విషయం చెప్పింది. దీంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. వెంటనే పాపను వైద్యం హాస్పిటల్ కు తరలించారు నిందితుడి కోసం గాలింపు ముమ్మురం చేశారు పోలీసులు.